Fadnavis: అందరూ ముఖ్యమంత్రి కాలేరు.. అజిత్ పవార్కు ఫడ్నవీస్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ఎన్సిపి నేత అజిత్ పవార్ చేసిన ప్రకటనపై మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అజిత్ పవార్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పు లేదని, అయితే అందరూ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. చాలామంది సీఎం పదవిని ఇష్టపడతారు కానీ అందరూ చేయలేరన్నారు.మహా వికాస్ అఘాడిలో ఏమి జరుగుతుందో తనకు తెలియదన్న ఫడ్నవీస్.. వారు వజ్ర ముత్ అని పిలుస్తున్నారని పేర్కొన్నారు. కానీ ముత్లో చాలా పగుళ్లు ఉన్నాయని, అది ఎప్పటికీ వజ్ర మఠం కాదని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.
Also Read:Ganga Ramayan Tour: గంగా రామాయణం టూర్ ప్యాకేజీ.. యాత్ర విశేషాలు ఇవే
అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో 2024 ఎన్నికల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారా అనే ప్రశ్నకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకుడు అజిత్ పవార్ తన ఆసక్తిని బయటపెట్టారు. తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించడం గురించి అజిత్ పవార్ మాట్లాడుతూ, “2024 ఎందుకు, ఇప్పుడు కూడా ఆ పదవికి సిద్ధమే” అని చెప్పారు. 2004లో ప్రజలు ఇచ్చిన సంఖ్యాబలంతోనే ఎన్సీపీకి ముఖ్యమంత్రి పదవి దక్కిందని గుర్తు చేశారు. కానీ రాజకీయాల్లో మాత్రం అగ్రనాయకత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. పార్టీలో క్రమశిక్షణ కొనసాగుతుందని, కాబట్టి నాయకత్వం ఏం చెబితే అది వింటామని ఆయన అన్నారు. 2004లో ఎన్సీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందని పవార్ తెలిపారు. అప్పుడు కాంగ్రెస్కు 69 సీట్లు, ఎన్సీపీకి 71 సీట్లు వచ్చాయని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది కానీ ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదన్నారు. ఎమ్మెల్యేలు పూర్తి మెజారిటీతో ఓటు వేసిన ఉపముఖ్యమంత్రి పదవిని తామే చేపట్టాలని ఆ తర్వాత తమకు ఆదేశాలు వచ్చాయన్నారు.
Also Read
తాజావార్తలు
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!