మోకాళ్ళపై జనం నిరసన.. ఎందుకో తెలుసా?
తమ డిమాండ్ల సాధనకు వివిధ రూపాలలో ప్రజలు, నేతలు నిరసన వ్యక్తం చేయడం ఆనవాయితీ. కలెక్టరేట్ల ముందు ఆందోళన చేపడతారు. రోడ్లపై రాస్తారోకో చేస్తారు. దీక్షలో కూర్చుని తమ డిమాండ్ల సాధనకు అధికారులు, నేతలపై వత్తిడి తెస్తారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఓ ఊరిజనం వినూత్నంగా నిరసన తెలిపి అందరినీ ఆకట్టుకున్నారు.
పెంబి మండలంలో యాపలగూడా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఊరినుంచి బయటకు వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎప్పటినుంచో అధికారులు, ప్రజాప్రతినిధుల వెంట పడ్డారు. వినతిపత్రాలు ఇచ్చారు. చివరకు అధికారులు స్పందించకపోవడంతో తాజాగా తమదైన రీతిలో నిరసన తెలిపారు. గ్రామస్తులంతా ఏకమై దొత్తి వాగు నీళ్ళలో మోకాళ్లపై నిరసనకు దిగారు. ‘‘కావాలి.. కావాలి మాకు రోడ్డు కావాలి.. మా ఊరికి రోడ్డు కావాలి’’ అంటూ నీళ్ళలో మోకాళ్ళపై నిలబడి నినదించారు.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్

గ్రామం ఏర్పడి 50 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నో ప్రభుత్వాలు మారినా రోడ్డు మారలేదు. గతుకుల రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని, మా బ్రతుకులు మారడం లేదని దొత్తి వాగులో నిరసన చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఓటు వేయమని మోకాళ్లపై నిరసన చేస్తూ నిరసన చేశామన్నారు. దొత్తి వాగు చుట్టూ 3 గ్రామ పంచాయితీలు, 12 గ్రామాలు సుమారు 2500 మంది జనాభా వున్నారు. ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాయకులకు వాగు బ్రిడ్జి గురించి చెబుతున్నారు. ఎన్నికలలో హామీ ఇస్తున్నారు. కానీ ఎన్నికలు అయ్యాక అన్నీ మరచిపోతున్నారు. వర్షాకాలం వస్తే మా ఊరు తప్ప ఎటు వెళ్లలేకపోతున్నామని, ఒకవేశ పనులకు బయటకు వెళితే అంతలో వాగు వస్తే పెంబి లొనే పడుకుంటామని అంటున్నారు. పిల్లలను చదువులకు పంపాలన్న కష్టంగా మారిందన్నారు. రోడ్డు లేకపోవడం వల్ల ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావడం లేదని, మా మగపిల్లలకు ఆడపిల్లలను ఇవ్వడం లేదని గ్రామస్తులు తెలిపారు.
వాగు వచ్చినప్పుడు బాలింతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జ్వరాలు వస్తే దేవుడి పై భారం పెడుతున్నామని, అనేకమంది మరణించిన వారు కూడా ఉన్నారని చెబుతున్నారు. వాగులో కొట్టుకుపోయిన వారు కూడా ఉన్నారని గ్రామస్తులు దేవ్ రావ్, రాజవ్వ అన్నారు. మా గ్రామాలకు రోడ్ వెయ్యక పోతే వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయమని గ్రామస్తులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.
తాజావార్తలు
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో