Mallikarjun Kharge: మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడవడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై దృష్టి మళ్లించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడుచుకోవడం లేదని, పార్లమెంటులో అంతరాయాలకు కారణమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ హౌస్ నుండి విజయ్ చౌక్ వరకు తిరంగా మార్చ్ తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో విపక్ష నేతల సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Also Read:AP CM Jagan: స్కామ్లు తప్ప.. స్కీమ్లు తెలియవు.. ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్
Also Read
పార్లమెంట్ లో బడ్జెట్పై చర్చ నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యం గురించి ప్రభుత్వం చాలా మాట్లాడుతుందని, కానీ అది చెప్పినదానిని పాటించడం లేదన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కోసం ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే అన్నారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ను కేవలం 12 నిమిషాల్లో ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. దేశ సంపదను కాపాడేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే తెలిపారు.
Also Read:India Oil Exports: రష్యా ఆయిల్తో భారత్ వ్యాపారం.. యూరప్కు పెరిగిన ఎగుమతులు..
18 నుండి 19 ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలు అదానీ విషయంపై ఉన్నాయని అన్నారు. కేవలం 2 నుండి 2.5 సంవత్సరాల కాలంలో అతని సంపద 12 లక్షల కోట్లకు ఎలా పెరిగిందని ఆయన అన్నారు. బీజేపీకి మెజారిటీ సభ్యులు ఉన్నందున జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. అదానీ సమస్యపై జెపిసి విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు అని ఖర్గే అన్నారు. అదానీ అంశంపై పార్లమెంటులో ప్రభుత్వం సమాధానం చెప్పలేదని, యూకేలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ద్వారా దృష్టిని మళ్లించిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!