Mallikarjun Kharge: మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడవడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై దృష్టి మళ్లించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడుచుకోవడం లేదని, పార్లమెంటులో అంతరాయాలకు కారణమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ హౌస్ నుండి విజయ్ చౌక్ వరకు తిరంగా మార్చ్ తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో విపక్ష నేతల సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Also Read:AP CM Jagan: స్కామ్లు తప్ప.. స్కీమ్లు తెలియవు.. ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్
Also Read
పార్లమెంట్ లో బడ్జెట్పై చర్చ నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యం గురించి ప్రభుత్వం చాలా మాట్లాడుతుందని, కానీ అది చెప్పినదానిని పాటించడం లేదన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కోసం ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే అన్నారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ను కేవలం 12 నిమిషాల్లో ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. దేశ సంపదను కాపాడేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే తెలిపారు.
Also Read:India Oil Exports: రష్యా ఆయిల్తో భారత్ వ్యాపారం.. యూరప్కు పెరిగిన ఎగుమతులు..
18 నుండి 19 ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలు అదానీ విషయంపై ఉన్నాయని అన్నారు. కేవలం 2 నుండి 2.5 సంవత్సరాల కాలంలో అతని సంపద 12 లక్షల కోట్లకు ఎలా పెరిగిందని ఆయన అన్నారు. బీజేపీకి మెజారిటీ సభ్యులు ఉన్నందున జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. అదానీ సమస్యపై జెపిసి విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు అని ఖర్గే అన్నారు. అదానీ అంశంపై పార్లమెంటులో ప్రభుత్వం సమాధానం చెప్పలేదని, యూకేలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ద్వారా దృష్టిని మళ్లించిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..