Mallikarjun Kharge: మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడవడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై దృష్టి మళ్లించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడుచుకోవడం లేదని, పార్లమెంటులో అంతరాయాలకు కారణమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ హౌస్ నుండి విజయ్ చౌక్ వరకు తిరంగా మార్చ్ తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో విపక్ష నేతల సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Also Read:AP CM Jagan: స్కామ్లు తప్ప.. స్కీమ్లు తెలియవు.. ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్
Also Read
పార్లమెంట్ లో బడ్జెట్పై చర్చ నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యం గురించి ప్రభుత్వం చాలా మాట్లాడుతుందని, కానీ అది చెప్పినదానిని పాటించడం లేదన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కోసం ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే అన్నారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ను కేవలం 12 నిమిషాల్లో ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. దేశ సంపదను కాపాడేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే తెలిపారు.
Also Read:India Oil Exports: రష్యా ఆయిల్తో భారత్ వ్యాపారం.. యూరప్కు పెరిగిన ఎగుమతులు..
18 నుండి 19 ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలు అదానీ విషయంపై ఉన్నాయని అన్నారు. కేవలం 2 నుండి 2.5 సంవత్సరాల కాలంలో అతని సంపద 12 లక్షల కోట్లకు ఎలా పెరిగిందని ఆయన అన్నారు. బీజేపీకి మెజారిటీ సభ్యులు ఉన్నందున జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. అదానీ సమస్యపై జెపిసి విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు అని ఖర్గే అన్నారు. అదానీ అంశంపై పార్లమెంటులో ప్రభుత్వం సమాధానం చెప్పలేదని, యూకేలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ద్వారా దృష్టిని మళ్లించిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!