ఉదయాన్నే చాలా మంది చిన్నారులు పేపర్ వేస్తూ కనిపిస్తుంటారు. వివిధ కారణాల వలన బాల్యం నుంచే కష్టపడి పనిచేయాల్సి వస్తుంటుంది. జగిత్యాల పట్టణానికి చెందిన జయప్రకాశ్ అనే విద్యార్థి ఉదయాన్నే పేపర్ వేస్తుండగా ఓ వ్యక్తి చదువుకునే వయసులో పేపర్ ఎందుకు వేస్తున్నావ్ అని ప్రశ్నించగా, తప్పేముంది, పేపర్ వేస్తూ చదువుకోకూడగా అని ఎదురు ప్రశ్నించారు. చిన్నతనం నుంచి కష్టపడి పనిచేస్తూ చదువుకుంటే పెద్దయ్యాక ఏ పని చేయాలన్నా కష్టం అనిపించదు. అని సమాధానం చెప్పాడు. దీనిని సంబందించిన వీడియోను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన మంత్రి కేటీఆర్ చిన్నారిని అభినందించారు. విద్యార్థిలోని ఆత్మవిశ్వాసానికి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. భవిష్యత్తులో మంచి స్థితిలో స్థిరపడాలని కోరుకుంటున్నట్టు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
Read: రేషన్ బియ్యం నొక్కేసి ఆఫ్రికా తరలిస్తున్న మాఫియా…!