ఢిల్లీలోని టిక్రీ ఖుర్ద్లో జరిగిన ఒక సంఘటన అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 62 ఏళ్ళ సతీష్ భరద్వాజ్ చనిపోయినట్టు నిర్ధారించారు 11 మంది వైద్యులు. ఏం అద్బుతం జరిగిందో తెలీదు. చితికి నిప్పంటించే ముందు అతని నోటిలో గంగాజలం పోశాక కళ్లు తెరిచి మాట్లాడాడు. దీంతో అతడిని చితిపై నుంచి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు.
కేన్సర్తో బాధపడుతున్న ఓ వృద్ధుడు మరణించాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో శ్మశానానికి తీసుకెళ్లారు. చితికి నిప్పు అంటించడానికి ముందు అతని నోట్లో గంగాజలం పోశారు. ఆ నీళ్లు నోట్లో పడిన వెంటనే వృద్ధుడిలో కదలిక కనిపించింది. ఆ వెంటనే కళ్లు తెరిచి మాట్లాడాడు. తానిక్కడ ఎందుకున్నానని ప్రశ్నించడంతో అక్కడున్న కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. వాళ్ళు వెంటనే తేరుకుని అంబులెన్స్కు, పోలీసులకు సమాచారం అందించారు. ఆపై నరేలాలోని రాజాహరిశ్చంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడాయనను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, బీపీ సాధారణంగా ఉందని, గుండె మామూలుగానే కొట్టుకుంటోందని తెలిపారు. మరింత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు. గంగాజలానికి అంత శక్తి వుందా అని చర్చించుకుంటున్నారు.