Gangster Atiq Ahmed: గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు ఎన్కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కొడుకును యూపీ పోలీసులు ఎన్కౌంటర్లో చంపారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు సహా ఇద్దరు వ్యక్తులను యూపీ పోలీసులు కాల్చి చంపారు. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఝాన్సీలో జరిపిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందంపై కాల్పులు జరపడంతో అసద్, గులాంలను కాల్చి చంపారు. నిందితుల దగ్గర లభించిన అత్యాధునిక ఆయుధాలు, కొత్త సెల్ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read:KA Paul: సింగరేణిని కొనలేని వాళ్లు విశాఖను కొంటారా?
ఫిబ్రవరి 24న ప్రయాగ్రాజ్ లోని తన ఇంటి బయట ఉమేష్ పాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అసద్ అహ్మద్, గులామ్లు నిందితులుగా ఉన్నారు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో అతిక్ అహ్మద్ నిందితుడు. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో ఉమేష్ పాల్ అనే న్యాయవాది సాక్షి. ఈ నేపథ్యంలో ఉమేష్ పాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను నిందితులు కాల్చి చంపారు. పగటిపూట జరిగిన దాడి ఉత్తరప్రదేశ్ శాంతిభద్రతలకు విఘాతం కలిగించింది. ఉమేష్ పాల్ హత్య కేసులో గ్యాంగ్స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ను ప్రయాగ్రాజ్లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) కోర్టు ముందు హాజరుపరిచిన రోజున అసద్ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం.
Also Read
సమాజ్వాదీ పార్టీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్.. కిడ్నాప్ కేసులో గత నెలలో శిక్ష పడింది. జైలులో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో గ్యాంగ్స్టర్ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గుజరాత్లోని జైలుకు తరలించారు. అతను జూన్ 2019 నుండి సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నాడు. గత రెండు నెలలుగా అతిక్ అహ్మద్ను కోర్టు విచారణల కోసం పలుమార్లు ఉత్తరప్రదేశ్కు తీసుకువచ్చారు.
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!