హుజూరాబాద్ బై ఎలక్షన్.. అసలు విషయం పక్కకు పోయిందా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కురుక్షేత్రాన్ని తలపించేలా పోటీపడుతున్నారు. ఎవరికీ వారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో హుజూరాబాద్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకెళుతుండగా కాంగ్రెస్ మాత్రం కొంచెం వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రచారంపై స్థానిక ఓటర్లు మాత్రం పెదవి విరుస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ ఆయనను మంత్రి పదవీ నుంచి తప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన తన ఎమ్మెల్యే పదవీ రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించేందుకు పోటీకి దిగారు. దీంతో ఈ ఉప ఎన్నిక కాస్తా ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా మారింది. ఈ ఉప ఎన్నిక ప్రభావం వచ్చే ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో సీఎం కేసీఆర్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచే హుజూరాబాద్లో రాజకీయవేడి మొదలైంది. గత ఐదునెలలుగా టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయి. ఈనెలలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో నేతలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. రాష్ట్ర, జాతీయ సమస్యలపై స్పందిస్తున్నారు. ఇక్కడే అసలు విషయం సైడ్ అయిపోతుందనే అభిప్రాయాన్ని స్థానిక ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు.
ఈటల స్వార్థంతోనే హుజూరాబాద్ లో ఉప ఎన్నిక వచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా బీజేపీ సైతం కేసీఆర్ అహంకారం వల్లే ఎన్నికలు వచ్చాయని విమర్శలకు దిగుతున్నారు. ఈ రెండు పార్టీలు దొందు దొందే అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. అయితే స్థానిక సమస్యలను ఏ పార్టీ కూడా ప్రస్తావించకపోవడం విడ్డూరంగా మారింది. స్థానిక సమస్యలు కాకుండా వ్యక్తిగత, రాష్ట్ర, జాతీయ సమస్యలను హుజూరాబాద్లో ప్రస్తావించడంపై ఓటర్లు మండిపడుతోన్నారు.
గత ఐదునెలలు హుజూరాబాద్లో నేతల ప్రచారం ఇలానే సాగుతోంది. నియోజకవర్గంలోని సమస్యలు ఏంటీ? ప్రజల సంక్షేమం కోసం ఏం చేయబోతున్నాం? అనే అంశాలపై ఏ పార్టీ కూడా మెనిఫెస్టో విడుదల చేయడం లేదని తెలుస్తోంది. స్థానిక యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై ఏ పార్టీ కూడా హామీలు ఇవ్వడం లేదు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికగా మారిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా నేతలు తమ తీరు మార్చుకొని స్థానిక సమస్యలను ప్రస్తావిస్తారో లేదంటే ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తారో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..