భారత్ – పాక్ : గంటలోనే అమ్ముడుపోయిన టికెట్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ఫ్యాన్స్ కి డబుల్ దమాకా మ్యాచ్. బెట్టింగ్ రాయుళ్లకు కోట్లు కురిపించే మ్యాచ్. నువ్వా నేనా అనే ఫైట్ ఈసారి వరల్డ్ కప్లో మొదటి మ్యాచే కావడంతో… సూపర్ సండే ఫైట్ కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్లో దంచికొట్టిన టీం కోహ్లీ… దయాది తో జరిగే మ్యాచ్ కోసం సయ్యంటోంది. క్రికెట్ లవర్స్ ఈ మ్యాచ్ కోసం ఎదరుచూస్తుంటే… మరోవైపు దాయాది పాకిస్తాన్ను వ్యతిరేకించే వర్గాలు మాత్రం.. ఈ మ్యాచ్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో… దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వద్ద అక్కడి ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
దాయాదుల పోరులో గెలుపెవరిది అనేదానికన్నా… మ్యాచ్ సమయం దగ్గరపడే కొద్దీ.. దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల్లో టీంఇండియా పాకిస్తాన్ తో మ్యాచ్ని బహిష్కరించాలని వాదనలు మొదలయ్యాయి. ఓ వైపు కశ్మీర్లో అరాచకాలు సృష్టిస్తున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు… అంతర్జాతీయ వేదికలపై భారత్ను వ్యతిరేకిస్తున్న పాక్ తో మ్యాచ్ ఆడొద్దని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తోపాటు కేంద్రమంత్రులు రామ్నాథ్ అథవాలే, గిరిరాజ్ సింఘ్, బీహార్ డిప్యుటీ సీఎం తార్కిషోర్ డిమాండ్ చేస్తున్నారు. మరొకవైనపు దేశంలో పాకిస్తాన్ ని వ్యతిరేకించే హిందూ సంఘాలు కూడా వీరికి గొంతును కలిపాయి.
Also Read
సూపర్ సండే ఫైట్ పై రాజకీయ వ్యతిరేకత ఎంతున్నా…. మ్యాచ్ జరిగి తీరుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐసీసీకి ఇచ్చిన మాట ప్రకారం అంతర్జాతీయ టోర్నీలో అర్ధంతరంగా తప్పుకోవడం కుదరదన్నారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆటకు…. రాజకీయ వివాదాలకు… క్రికెట్ మ్యాచ్లను బహిష్కరించడం సబబు కాదని బీసీసీఐ వాదన. ఇండియా పాక్తోపాటు ప్రపంచ దేశాల్లో దాయాదుల మధ్య మ్యాచ్ జరగాలనే వారి సంఖ్య అధికంగా ఉందంటున్నారు క్రికెట్లవర్స్.
అయితే… ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా.. తాను సోషల్ మీడియాకు బలవుతున్నానని వాపోతోంది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. పాకిస్తాన్ కోడలిగా ఇండియా ఐకాన్గా తాను ఈసారి ఎవరికీ మద్దతివ్వకుండా… ఈ హై టెన్షన్ మ్యాచ్ రోజున సోషల్ మీడియాకి దూరంగా ఉంటానని వీడియో పోస్ట్ చేసింది.
స్పాట్… సానియా వీడియో
వరల్డ్ కప్ లో ఏ మ్యాచ్ కి లేనటువంటి టికెట్ల డిమాండ్… ఇండో పాక్ మ్యాచ్ కి ఉండటంతో… దుబాయ్లో గంటకే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం కెపాసిటి… 25 వేలు. 24న జరిగే మ్యాచ్ కోసం ఈనెల 4న టికెట్లను అందుబాటులోకి తెచ్చింది ఐసీసీ. సైట్లో పెట్టిన గంటలోపే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
ఇండియా పాక్ మ్యాచ్ దుబాయ్లోనే జరుగుతున్నా…. హైదరాబాద్లో జరుగుతోందా అని తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి పబ్స్, మాల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్. క్రికెట్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసేలా ఫుడ్ అండ్ డ్రింక్స్ పై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. బిగ్ స్క్రీన్స్, ప్రొజెక్టర్లను ఏర్పాటు చేస్తున్నాయి. సినిమా హాల్స్ కూడా పెద్దగా రద్దీగా లేకపోవడంతో… మ్యాచ్ ను థియేటర్లో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!