గ్రేటర్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రకటించారు.. నామినేషన్లు వేసిన 18 మందిలో 3 నామినేషన్ల ఉపసంహరణతో ఏకగ్రీవం అయినట్టుగా వివరించారు లోకేష్ కుమార్.. కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, వనం సంగీత యాదవ్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని వెల్లడించిన ఆయన.. దీంతో స్టాండ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్టు తెలిపారు.. ఇక, ఏక గ్రీవంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల పేర్లను పరిశీలిస్తే.. కుర్మ హేమలత, పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రవీణ్ సుల్తానా, వై. ప్రేమ్ కుమార్, బాత జబీన్, మహాపార, మందగిరి స్వామి, మందాడి శ్రీనివాస్ రావు, మీర్జా ముస్తాఫ బేగ్, మహమ్మద్ అబ్దూల్ సలామ్, ఎండీ రషీద్, రావుల శేషగిరి, సీఎన్ రెడ్డి, విజయ్ కుమార్ గౌడ్, సామల హేమ ఉన్నారు.
Read Also: బండి సంజయ్ కాన్వాయ్పై రాళ్ల దాడి.. కారు అద్దాలు ధ్వంసం
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 15 నామినేషన్లతో కూడిన తుది జాబితాను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. 15 మందిలో టీఆర్ఎస్ నుంచి ఎనిమిది మంది కార్పొరేటర్లు, ఎంఐఎం నుంచి ఏడుగురు స్టాండింగ్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి జీహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీకి 47 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ స్టాండింగ్ కమిటీకి ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. కాగా, ఎంఐఎం నుండి, గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ వార్డుల నుండి మొత్తం 44 మంది కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ స్టాండ్ కమిటీ ఎన్నికలకు నవంబర్ 2న నోటిఫికేషన్ విడుదల చేశారు.. నోటిఫికేషన్ ప్రకారం, జీహెచ్ఎంసీకి చెందిన 150 మంది కార్పొరేటర్ల ద్వారా మొత్తం 15 మంది సభ్యులను కమిటీకి ఎన్నుకోనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కార్పొరేటర్ల నుంచి మొత్తం 18 నామినేషన్లు రాగా.. 15 కంటే ఎక్కువ నామినేషన్లు ఉంటే నవంబర్ 20న స్టాండింగ్ కమిటీకి పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే, ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించు కోవడంతో ఏకగ్రీవం అయ్యింది.. దీంతో స్టాండింగ్ కమిటీకి ఎలాంటి పోలింగ్ జరగడం లేదని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!