Eatala Rajendar: హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
- హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై..
- గవర్నర్
- డీజీపీలను కలిశాం- ఎంపీ ఈటల రాజేందర్
- ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది- ఈటల
- ముత్యాలమ్మ గుడి విషయంలో ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించాం
- కొంత మంది బయట వాళ్ళు వచ్చి చెప్పులు వేశారు- ఈటల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై గవర్నర్, డీజీపీలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. దీని వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటికీ బయట పెట్టలేదని అన్నారు. ముత్యాలమ్మ గుడి విషయంలో ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించాము.. కొంతమంది బయట వాళ్ళు వచ్చి చెప్పులు వేశారు.. తమ వాళ్ళపై విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ చేశారని తెలిపారు. సీఎం.. కొట్టిన పోలీసులకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారని అన్నారు. హత్యయత్నం కేసులు పెట్టారని పేర్కొన్నారు. హిందూ సంస్థలు, బీజేపీ ప్రజల క్షేమాన్నే కోరుకుంటుందని ఈటల రాజేందర్ చెప్పారు. రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత ద్వేష భావం.. ప్రశ్నిస్తే మతోన్మాదులుగా, ద్రోహులుగా చిత్రీకరిస్తారని దుయ్యబట్టారు.
Read Also: Paytm Q2 Results: పేటీఎంకి మళ్లీ మంచిరోజులు.. లాభాల్లో కంపెనీ!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మతకల్లోలాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఓట్ల రాజకీయం కోసం ఆలయంలో దాడిచేసిన వారిని పట్టుకునే దమ్ములేక శాంతియుత ర్యాలీ చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లిపర్ సెల్స్ ఉన్నాయని, రోహింగ్యాలు ఉన్నారని కేంద్రం హెచ్చరికలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నివారించలేకపోతుందని వ్యాఖ్యానించారు.
Read Also: Air India Kanishka bombing case: “ఎయిర్ ఇండియా కనిష్క బాంబింగ్” నిందితుడి హత్య కేసులో కీలక పరిణామం..
టెర్రరిస్టులు ఎవరు..? రెచ్చగొట్టేవారు ఎవరు..? సంఘ విద్రోహ శక్తులు ఎవరో తేల్చాలని ఎంపీ తెలిపారు. హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో రేవంత్ విఫలమయ్యారు.. అన్ని వర్గాల క్షేమం కోసం.. సమాజ హితం కోసం పనిచేయాలని ప్రభుత్వానికి చెబుతున్నానని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే బీజేపీ పనిచేస్తోంది.. రక్తపాతాన్ని, దుర్మార్గాన్ని ఏ మత పెద్దలు అంగీకరించరన్నారు. హిందూ కార్యకర్తల అరెస్ట్లను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.. చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేమని హెచ్చరించారు. పరిణామాలకు సీఎం బాధ్యత వహించాల్సి వస్తుందని ఈటల రాజేందర్ తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..