Air India Kanishka bombing case: “ఎయిర్ ఇండియా కనిష్క బాంబింగ్” నిందితుడి హత్య కేసులో కీలక పరిణామం..
- ఎయిర్ ఇండియా కనిష్క నిందితుడి హత్య కేసులో కీలక పరిణామం..
- రిపుదమన్ని హత్య చేసిన ఇద్దరికి సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Kanishka bombing case: 1985 ఎయిర్ ఇండియా కనిష్క బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడిగా ఉండీ, నిర్దోషిగా విడుదలైన సిక్కు వ్యక్తి రిపుదమన్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులు ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారుర. వీరికి కెనడియన్ కోర్టులో సెకండ్ డిగ్రీ హత్య కేసు నమోదైనట్లు మీడియా నివేదికలు తెలిపాయి. టాన్నర్ ఫాక్స్, జోస్ లోపెజ్ ఇద్దరు 75 ఏళ్ల రిపుదమన్ సింగ్ మాలిక్ని 2022లో సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. ఈ కేసు విచారణ సందర్భంగా సోమవారం బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
రిపుదమన్ సింగ్, అజైబ్ సింగ్ బగ్రీ ఇద్దరూ కూడా కెనడా మాంట్రియల్ నుంచి బయలుదేరి ముంబైకి వెళ్తున్న ఏయిరిండియా కనిష్క విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రంపై ఉన్న సమయంలో పేల్చివేసిన ఘటనలో అనుమానితులుగా ఉన్నారు. ఈ కేసులో వీరిద్దరు 2005లో నిర్దోషులుగా విడుదలయ్యారు. రిపుదమన్ని చంపిన ఇద్దరికి తక్కువ అభియోగాలకు సంబంధించి సెకండ్ డిగ్రీ హత్య నేరం మోపబడింది. రిపుదమన్ని చంపడానికి వేరే వ్యక్తులు వీరిద్దరిని నియమించుకున్నట్లు కోర్టు నివేదిక తెలిపింది. అయితే, ఈ కేసులో వీరిద్దరికి కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తులను కోర్టు ముందుకు కెనడా పోలీసులు తీసుకురావాలని రిపుదమన్ సింగ్ కుటుంబం కోరింది.
Also Read
Read Also: J-K: చైనా కోసమే కాశ్మీర్లో పాక్ ఉగ్రవాద సంస్థ దాడి!.. 7గురు భారతీయుల మృతి
ఎయిరిండియా కనిష్క కేసు:
జూన్ 23, 1985 ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు దాడి భారత్ ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడిగా మిగిలిపోయింది. ఈ ఏడాదితో ఈ ఉగ్రఘటనకు 39 ఏళ్లు. ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడా నుంచి ఇండియాకు వస్తున్న ఎయిర్ ఇండియా కనిష్క 182 విమానాన్ని బాంబులతో పేల్చేశారు. కెనడాలోని మాంట్రియల్ నుంచి లండన్, ఢిల్లీ మీదుగా ముంబై చేరాల్సిన విమానం అట్లాంటిక్ మహాసముద్రంపై కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 329 మంది మరణించారు. మొదటి స్టాప్ ఓవర్ లండన్ హీత్రూ విమానాశ్రయంలో దిగడానికి 45 నిమిషాల ముందు ఐర్లాండ్ తీరానికి 190 కి.మీ దూరంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూలిపోయింది. రాడాన్ నుంచి అదృశ్యమైన వెంటనే రెస్క్యూ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఒక్క ప్రయాణికుడు కూడా బతకలేదు. సముద్రం నుంచి 131 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. విమానం 31,000 ఫీట్ల ఎత్తులో ఉన్న సమయంలో బాంబు పేలుడు సంభవించినట్లు తేలింది. ఈ ప్రమాదంలో 268 మంది కెనడా పౌరులు, 27 మంది బ్రిటీష్ జాతీయులు, 24 మంది భారతీయులు మరణించారు.
తాజావార్తలు
-
RaviMohan : జయంరవి చెప్పిన మూడక్షరాల ఇడ్లి నటి ఆమేనా?
-
CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
-
International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
-
Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
-
Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..