Kejriwal: ఫేక్ డిగ్రీపై తగ్గేదేలే.. మరోసారి మోడీని టార్గెట్ చేసిన ఢిల్లీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన డిగ్రీ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మాటల దాడిని పెంచారు. దేశానికి నకిలీ డిగ్రీ ఉన్న ప్రధానమంత్రి అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై మరోసారి పరోక్షంగా విరుచుకుపడ్డారు.
Also Read:Hyderabad: చిన్నారి ప్రాణం తీసిన మస్కిటో లిక్విడ్
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
కొంతమంది విద్యార్థులు చదువులో పేదలైతే వారికి అదనపు తరగతులు నిర్వహిస్తాం అని సీఎం అన్నారు. వారిలో ఒకరు భవిష్యత్తులో భారత ప్రధాని అవుతారు అని చెప్పారు. ఫేక్ డిగ్రీతో ఎవరైనా ప్రధాని కావాలని మేం కోరుకోవడం లేదు అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. దేశ రాజధానిలోని విద్యా రంగంలో ఆప్ ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రశ్నించిన బిజెపి నాయకుడు హరీష్ ఖురానాకు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మార్కుషీట్లను ఖురానా ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి స్పందన వచ్చింది.
Also Read:Jammu And Kashmir: కేంద్రమంత్రి కారును ఢీకొట్టిన ట్రక్కు… తృటిలో తప్పించుకున్న కిరణ్ రిజిజు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ తన విద్యార్హతలపై ప్రధానిపై విరుచుకుపడడం ఇదే మొదటిసారి కాదు. తన ఇటీవల అస్సాం పర్యటనలో కేజ్రీవాల్ పీఎం మోడీ యొక్క అర్హతలను ప్రశ్నించారు. ప్రధాని మోడీ చదువుకుని ఉంటే, అతను నోట్ల రద్దుకు పిలుపునిచ్చేవాడు కాదని అన్నారు. చివరికి రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలను కూడా తీసుకురాడు అని అన్నారు.
ప్రధాని మోదీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలకు సంబంధించిన వివరాలను ఆప్ అధినేతకు అందించాలని గుజరాత్ యూనివర్సిటీని ఆదేశించిన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) 2016 నాటి ఉత్తర్వును రద్దు చేసిన తర్వాత గుజరాత్ హైకోర్టు మార్చి 31న కేజ్రీవాల్కు రూ.25,000 జరిమానా విధించింది. అప్పటి నుంచి ఈ విషయమై ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!