Kejriwal: ఫేక్ డిగ్రీపై తగ్గేదేలే.. మరోసారి మోడీని టార్గెట్ చేసిన ఢిల్లీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన డిగ్రీ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మాటల దాడిని పెంచారు. దేశానికి నకిలీ డిగ్రీ ఉన్న ప్రధానమంత్రి అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై మరోసారి పరోక్షంగా విరుచుకుపడ్డారు.
Also Read:Hyderabad: చిన్నారి ప్రాణం తీసిన మస్కిటో లిక్విడ్
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
కొంతమంది విద్యార్థులు చదువులో పేదలైతే వారికి అదనపు తరగతులు నిర్వహిస్తాం అని సీఎం అన్నారు. వారిలో ఒకరు భవిష్యత్తులో భారత ప్రధాని అవుతారు అని చెప్పారు. ఫేక్ డిగ్రీతో ఎవరైనా ప్రధాని కావాలని మేం కోరుకోవడం లేదు అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. దేశ రాజధానిలోని విద్యా రంగంలో ఆప్ ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రశ్నించిన బిజెపి నాయకుడు హరీష్ ఖురానాకు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మార్కుషీట్లను ఖురానా ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి స్పందన వచ్చింది.
Also Read:Jammu And Kashmir: కేంద్రమంత్రి కారును ఢీకొట్టిన ట్రక్కు… తృటిలో తప్పించుకున్న కిరణ్ రిజిజు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ తన విద్యార్హతలపై ప్రధానిపై విరుచుకుపడడం ఇదే మొదటిసారి కాదు. తన ఇటీవల అస్సాం పర్యటనలో కేజ్రీవాల్ పీఎం మోడీ యొక్క అర్హతలను ప్రశ్నించారు. ప్రధాని మోడీ చదువుకుని ఉంటే, అతను నోట్ల రద్దుకు పిలుపునిచ్చేవాడు కాదని అన్నారు. చివరికి రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలను కూడా తీసుకురాడు అని అన్నారు.
ప్రధాని మోదీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలకు సంబంధించిన వివరాలను ఆప్ అధినేతకు అందించాలని గుజరాత్ యూనివర్సిటీని ఆదేశించిన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) 2016 నాటి ఉత్తర్వును రద్దు చేసిన తర్వాత గుజరాత్ హైకోర్టు మార్చి 31న కేజ్రీవాల్కు రూ.25,000 జరిమానా విధించింది. అప్పటి నుంచి ఈ విషయమై ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!