Kejriwal: ఫేక్ డిగ్రీపై తగ్గేదేలే.. మరోసారి మోడీని టార్గెట్ చేసిన ఢిల్లీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన డిగ్రీ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మాటల దాడిని పెంచారు. దేశానికి నకిలీ డిగ్రీ ఉన్న ప్రధానమంత్రి అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై మరోసారి పరోక్షంగా విరుచుకుపడ్డారు.
Also Read:Hyderabad: చిన్నారి ప్రాణం తీసిన మస్కిటో లిక్విడ్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
కొంతమంది విద్యార్థులు చదువులో పేదలైతే వారికి అదనపు తరగతులు నిర్వహిస్తాం అని సీఎం అన్నారు. వారిలో ఒకరు భవిష్యత్తులో భారత ప్రధాని అవుతారు అని చెప్పారు. ఫేక్ డిగ్రీతో ఎవరైనా ప్రధాని కావాలని మేం కోరుకోవడం లేదు అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. దేశ రాజధానిలోని విద్యా రంగంలో ఆప్ ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రశ్నించిన బిజెపి నాయకుడు హరీష్ ఖురానాకు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మార్కుషీట్లను ఖురానా ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి స్పందన వచ్చింది.
Also Read:Jammu And Kashmir: కేంద్రమంత్రి కారును ఢీకొట్టిన ట్రక్కు… తృటిలో తప్పించుకున్న కిరణ్ రిజిజు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ తన విద్యార్హతలపై ప్రధానిపై విరుచుకుపడడం ఇదే మొదటిసారి కాదు. తన ఇటీవల అస్సాం పర్యటనలో కేజ్రీవాల్ పీఎం మోడీ యొక్క అర్హతలను ప్రశ్నించారు. ప్రధాని మోడీ చదువుకుని ఉంటే, అతను నోట్ల రద్దుకు పిలుపునిచ్చేవాడు కాదని అన్నారు. చివరికి రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలను కూడా తీసుకురాడు అని అన్నారు.
ప్రధాని మోదీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలకు సంబంధించిన వివరాలను ఆప్ అధినేతకు అందించాలని గుజరాత్ యూనివర్సిటీని ఆదేశించిన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) 2016 నాటి ఉత్తర్వును రద్దు చేసిన తర్వాత గుజరాత్ హైకోర్టు మార్చి 31న కేజ్రీవాల్కు రూ.25,000 జరిమానా విధించింది. అప్పటి నుంచి ఈ విషయమై ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
తాజావార్తలు
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..