వినోదాల సందడి… అనిల్ రావిపూడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిడికెడు సినిమాలు తీసినా, గంపెడు పేరు సంపాదించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నాటి క్రేజీ డైరెక్టర్స్ లో అనిల్ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. నవ్వించి, కవ్వించడంలో అందెవేసిన చేయి అనిపించుకున్నారు అనిల్. వినోదం కోరుకొనే వారికి నూటికి నూరుపాళ్లు సంతృప్తిని కలిగించడమే ధ్యేయంగా సాగుతున్నారాయన. ప్రేక్షకుడు కొన్న టిక్కెట్ కు సరిపడా సంతోషాన్ని అందించి మరీ పంపించడం అలవాటుగా చేసుకున్నారు. అనిల్ సినిమాలను చూసినవారెవరైనా ఆ మాటే అంటారు.
అనిల్ రావిపూడి 1982 నవంబర్ 23న జన్మించారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిలుకూరి వారిపాలెం వారి స్వస్థలం. తండ్రి బ్రహ్మయ్య ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేసేవారు. తల్లి అనంతలక్ష్మి గృహిణి. ఓ అక్క- ఇదే అనిల్ కుటుంబం. ఒకడే కొడుకు కావడం వల్ల అతని అభిలాషకు కన్నవారు అడ్డు చెప్పలేదు. చిన్నప్పటి నుంచీ సినిమాలు చూస్తూ, వాటిలోని అంశాలను చర్చిస్తూ ఎంజాయ్ చేశారు. సింగీతం శ్రీనివాసరావు, బాపు, జంధ్యాల సినిమాలంటే అభిమానం. ఇక మాస్ లో కె.రాఘవేంద్రరావు, బి.గోపాల్, ఎ.కోదండరామిరెడ్డి చిత్రాలనూ మహా ఇష్టపడేవారు. డైలాగ్స్ దంచి కొట్టడంలో దాసరి నారాయణరావునూ మరచిపోరు. ఇలా పలు చిత్రాలు చూస్తూ సాగిన అనిల్ రావిపూడి బి.టెక్., పూర్తి కాగానే తన సమీప బంధువైన దర్శకుడు పి.అరుణ్ ప్రసాద్ చెంత చేరిపోయారు. తన కలం బలంతో తొలుత మాటలు పలికిస్తూ సాగారు. శంఖం, మిస్టర్ పర్ ఫెక్ట్, కందిరీగ, దరువు, మసాల, ఆగడు వంటి చిత్రాలకు రచనలో పాలు పంచుకున్నారు. ఓ వైపు మాటలు రాసేస్తున్నా, మరోవైపు తన ఆలోచనలతో దర్శకత్వం వైపు అడుగులు వేయడం ఆపలేదు. సొంతగా కథ తయారు చేసుకొని, కొత్తవారిని ప్రోత్సహిస్తోన్న నందమూరి కళ్యాణ్ రామ్ ను కలిశారు అనిల్. ఈయన చెప్పిన కథ ఆయనకు భలేగా నచ్చడంతో అవకాశం ఇచ్చేశారు. తత్ఫలితంగా పటాస్ తెరకెక్కింది. తొలి చిత్రంతోనే అనిల్ కు విజయం దక్కింది.
Also Read
అనిల్ లోని వినోదం పంచే తీరు ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు బాగా నచ్చింది. వరుసగా అనిల్ తో సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలు తెరకెక్కించారు దిల్ రాజు. ఆ సమయంలో సదరు చిత్రాల హీరోలకు సరైన సక్సెస్ ఎంతో అవసరం. అది అనిల్ రావిపూడి సినిమాల ద్వారా దక్కింది. దాంతో అనిల్ పేరు చిత్రసీమలో మారుమోగింది. మధ్యలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రూపొందించిన ఎఫ్-2 కూడా జనానికి చక్కిలిగింతలు పెట్టింది. ఆ తరువాత మహేశ్ బాబు లాంటి టాప్ హీరోతో సినిమా తీసే చాన్స్ కొట్టేశారు అనిల్. మహేశ్ తో అనిల్ రూపొందించిన సరిలేరు నీకెవ్వరు 2020 సంక్రాంతికి సందడిచేసింది. దర్శకుడయిన తరువాత కూడా అనిల్ పండగ చేస్కో, గాలి సంపత్ వంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. తన ఎఫ్-2కు సీక్వెల్ గా అనిల్ రావిపూడి ఎఫ్-3 రూపొందించారు. రాబోయే ఫిబ్రవరి 25న ఆ చిత్రం జనం ముందుకు రానుంది. ఆ సినిమా తరువాత అనిల్ దర్శకత్వంలో ఏ సినిమా తెరకెక్కనుందో ఇంకా తెలియదు కానీ, ఓ స్టార్ హీరోతో సినిమా ఉంటుందని వినిపిస్తోంది.
తాను మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వాడిని కాబట్టి, సగటు ప్రేక్షకుల అభిరుచి బాగా తెలుసునని, అనేకమంది జనం కోరుకొనేది వినోదమే కాబట్టి, దానిని తన సినిమాల్లో తప్పకుండా చొప్పిస్తానని అంటారు అనిల్. కన్నవారికి ఓ మంచి భవంతి కట్టి ఇచ్చి వారి కళ్ళలో ఆనందం చూశానని, అదే అన్నిటికంటే తాను అందుకున్న పెద్ద అవార్డు అని అనిల్ భావిస్తారు. మునుముందు అనిల్ రావిపూడి తన చిత్రాలతో ఏ తీరున అలరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!