సీఎంగా శివ.. బీజేపీ చీఫ్గా విష్ణు ఉన్నారు.. కరోనా ఏమీ చేయలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఏ దేశాన్ని రాష్ట్రాన్ని వదలిపెట్టడం లేదు.. కాస్త అజాగ్రత్తగా ఉన్న ఏ వ్యక్తిని కూడా వదలకుండా పనిపట్టేస్తోంది… అయితే, ఆ మహమ్మారి ఏమీ చేయలేదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్.. బీజేపీ కార్యకర్తలకు కరోనా వాలంటీర్లుగా పనిచేసేందుకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యకరమానికి హాజరైన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివుడు, పార్టీ చీఫ్గా విష్ణువు ఉండగా ఇక మధ్యప్రదేశ్ను మహమ్మారి ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. కాగా, మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవహరిస్తుండగా.. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా విష్ణుదత్ శర్మ పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు.. మహారాష్ట్రలో ఈ సంవత్సరం జనవరి నుండి మే వరకు 3.28 లక్షల మరణాలు సంభవించాయని కాంగ్రెస్ నేతలు మండిపడ్డుతున్నారు.. కరోనా ఇంతటి కల్లోలం సృష్టించినా… బీజేపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తల నుండి ప్రశంసలు పొందడంలో మాత్రమే నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది… అయితే, “రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు మరియు ముఖ్యమంత్రి శివ్ అయిన మధ్యప్రదేశ్కు కరోనా ఎలా హాని చేస్తుంది” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.. ఇక, ఈ ఏడాది డిసెంబర్ నాటికి 135 కోట్ల డోస్ కోవిడ్ -19 టీకాలు దేశంలోని ఆరోగ్య కేంద్రాలకు చేరుకుంటాయని మిస్టర్ చుగ్ చెప్పారు. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా బిజెపిపై విమర్శలు గుప్పించారు, తమ నాయకులు తమ పార్టీ కార్యకర్తల నుండి ప్రశంసలు పొందడానికి మాత్రమే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. మిస్టర్ గుప్తా ఈ సంవత్సరం జనవరి మరియు మే మధ్య మధ్యప్రదేశ్లో 3.28 లక్షల మంది మరణించారు, ఇది సాధారణ మరణాల రేటు కంటే 54 శాతం ఎక్కువ అని దుయ్యబట్టారు.. కాగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే అధికార కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్ కేసుల పాజిటివ్ కేసుల సంఖ్య 7,91,960కి చేరుకోగా.. ఇప్పటి వరకు 10,514 మంది కోవిడ్తో మరణించారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!