రోజుకో వివాదం! ఈ చిత్రసీమకు ఏమైంది!!
గత కొన్ని రోజులుగా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి, దర్శకుల సంఘం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రంలో భజ గోవిందం పదాన్ని ఎరోటిక్ సీన్స్ నేపథ్యంలో వాడారని, దాన్ని వెంటనే తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్స్ లోనూ కేసులు పెట్టారు. దాంతో దర్శకుడు యుగంధర్ తన ప్రమేయం లేకుండా ఆ పదం పొరపాటున ట్రైలర్ లో చేరిందని బేషరతుగా క్షమాపణలు చెప్పి, దానిని తొలగించారు. చిత్రం ఏమంటే… ఇలాంటి వివాదాలు ఇప్పుడు రోజుకు ఒకటి చొప్పున చెలరేగుతున్నాయి.
అది జరిగిన మూడు రోజులకే ‘వరుడు కావలెను’ చిత్రంలోని ‘దిగు దిగు దిగు నాగ’ పాట విడుదలైంది. నాగ దేవతను భక్తితో కొలుస్తూ పాడే జానపద గీతం మకుటాన్ని ఈ సినిమాలో ఫక్తు కమర్షియల్ సాంగ్ కు ఉపయోగించడాన్ని హిందూ సంస్థల ప్రతినిధులు తప్పు పట్టారు. మళ్ళీ ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళను కలిసి మొర పెట్టుకున్నారు. దర్శక నిర్మాతలు సానుకూలంగా స్పందించి, ఆ పాటలోని పదాలను తొలగిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
ఇది జరిగిన మర్నాడే… మరో వివాదం! ఈ సారి ‘మహా సముద్రం’లోని స్పెషల్ సాంగ్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసింది. ఇటీవల ఈ సినిమాలోని ‘హే రంభ… హే రంభ’ అనే పాట విడుదలైంది. ఇందులో ‘సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఒక్క వేలితో కొండనెత్తాడే…. ఒంటిచేత్తో ఆంజనేయుడే సంజీవనీ ఎత్తుకొచ్చాడే, మనం అంత గొప్పోళ్ళం కాదు… ఓ సీసానైనా ఎత్తకపోతే ఎట్టా!?’ అంటూ పాట సాగడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్ళను తమతో పోల్చుకుంటూ మందు బాబులు ఈ పాట పాడటం సరి కాదంటూ విమర్శిస్తున్నారు. శనివారం నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ ను కలిసి నిర్మాతతో మాట్లాడి ఈ పాటలోని అభ్యంతరకర పదాలను తొలగించేలా చేయమని కోరారు. హిందు సంస్థల ప్రతినిధులతో పాటు నటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణీ సైతం వీరితో ప్రసన్నను కలిశారు. దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన వివరణ తమకు ఏ మాత్రం సమంజసంగా అనిపించలేదని ఆమె అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని సినిమా వారు భావించరని, ఏదైనా పొరపాటు నిజంగా జరిగితే తప్పకుండా సరి చేసుకునేలా చేస్తామని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న హామీ ఇచ్చారు.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జనం ఇప్పుడిప్పుడే ధైర్యంగా థియేటర్లకు వస్తున్నారు. మరి ఈ సమయంలో దర్శక నిర్మాతలు అనవసరమైన వివాదాలకు తావ్వు ఇవ్వకుండా అన్ని వర్గాల ప్రేక్షకులూ హాయిగా థియేటర్లకు వచ్చేలా చేస్తే వారికే మంచిది.
తాజావార్తలు
-
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
-
Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!