కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కష్టపడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ నేతృత్వంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ పేరున్న శివకుమార్..రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తారన్న నమ్మకంతో పార్టీ అగ్ర నాయకత్వం ఉంది. మేలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై కాంగ్రెస్లో ఏవైనా చీలికలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వాదనను తోసిపుచ్చిన రాష్ట్ర పార్టీ చీఫ్ డికె శివకుమార్. పార్టీ నాయకత్వం విధేయత, కృషికి ప్రతిఫలమిస్తుందనడంలో సందేహం లేదని ఆయన అన్నారు.
Also Read: Bandi sanjay wife: ఎమోషన్స్ లేని ఈ ప్రభుత్వానికి “బలగం” సినిమా చూపించాలి
నేను పార్టీకి నమ్మకమైన వ్యక్తిని, పార్టీకి ద్రోహం చేయలేదు.. కర్ణాటక ఎన్నికల్లో గెలుస్తాం. ఆ తర్వాత హైకమాండ్కే వదిలేస్తాం. పార్టీకి అండగా నిలిచే ప్రజలకు హైకమాండ్ ఎప్పుడూ అండగా నిలుస్తోంది. మా నాయకత్వంపై నాకు నమ్మకం ఉందన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి కాంగ్రెస్ నాయకత్వం ప్రతిఫలమిస్తుందని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని డీకే శివకుమార్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు తాను పీసీసీ పదవిని తీసుకున్నానని గుర్తు చేశారు. దానిని పునరుద్ధరించడానికి అవిశ్రాంతంగా పనిచేశానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మూల మూలకు వెళ్లానని తెలిపారు. తాము బిజెపికి వ్యతిరేకంగా బలమైన శక్తిగా పార్టీని నిర్మించామన్నారు.
Also Read:Bandi sanjay: బండి సంజయ్ పిటిషన్ విచారణ ఈనెల 10 కి వాయిదా
అత్యున్నత పదవికి పోటీదారుగా భావించే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో అంతర్గత పోరుపై వస్తున్న ప్రచారాన్ని శివకుమార్ తోసిపుచ్చారు. తాము కలిసి పని చేస్తున్నామని, బీజేపీ తమ మధ్య వైరం పెడుతోందని చెప్పారు. మేమంతా కలిసికట్టుగా ఉన్నామని, బీజేపీని ఓడించి కర్ణాటక పరువు నిలబెట్టడమే తమ ఉమ్మడి లక్ష్యం శివకుమార్ స్పష్టం చేశారు.