Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Congress Accuses Adani Group Of Having Links With Chinese Firm

Congress : అదానీ గ్రూప్‌కు చైనా కంపెనీతో సంబంధాలు.. దేశ భద్రతకు ముప్పు!

Published Date :April 7, 2023 , 5:29 pm
By NTV WebDesk
Congress : అదానీ గ్రూప్‌కు చైనా కంపెనీతో సంబంధాలు.. దేశ భద్రతకు ముప్పు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అదానీ వ్యవహారం కుదిపేసింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం అదానీ వ్యవహారంపైనే చర్చించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అదానీ గ్రూప్ పై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు వంటి అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో అదానీ గ్రూప్‌కు చైనా కంపెనీతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
Also Read:Pocharam Srinivas Reddy : కొత్త బిచ్చగాళ్లకు కేసీఅర్‌ను ఎదుర్కొనే దమ్ము లేదు

చైనాకు చెందిన చాంగ్ చియాన్ టింగ్ యాజమాన్యంలోని కంపెనీ – అదానీ గ్రూప్‌కు సబ్‌కాంట్రాక్టర్ అని అదానీ సోదరుడి భాగస్వామి అని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా ష్రినేట్ ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాల పేర్లను చైనా మూడుసార్లు మార్చిందన్నారు. అయితే చైనా యాజమాన్యంలోని కంపెనీకి అదానీ గ్రూప్‌తో ఉన్న లింక్‌లు చైనాతో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ప్రత్యేక సంబంధాన్ని చూపుతున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా దేశ వ్యతిరేకం అని ఆమె అన్నారు.ఇది జాతీయ భద్రతకు ముప్పు కాకపోతే ఏమిటి? అని ఆమె ప్రశ్నించారు. ఈ సంబంధం కారణంగానే మోడీ చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారని, అందుకే చైనా లేదా అదానీ సమస్యపై ఆయన ఇంకా మౌనం వీడలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆరోపించారు.చైనీస్ కంపెనీపై ప్రభుత్వం ఎప్పుడు విచారణ జరుపుతుంది? అని నిలదీశారు. అదానీ గ్రూప్‌కు చెందిన షెల్ కంపెనీల్లో డిపాజిట్ అయినట్లు ఆరోపించబడిన రూ. 20,000 కోట్ల మూలాన్ని కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు.
Also Read:Kishan Reddy : బంగారు తెలంగాణను పక్కకు పెట్టి… బంగారు కుటుంబం నిర్మించుకున్నారు

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్విట్టర్‌లో మాట్లాడుతూ.. ‘చైనీస్‌పై ప్రధాని మౌనంగా ఉండడానికి కారణం రోజురోజుకూ స్పష్టమవుతోంది. అదానీకి చైనాతో ఉన్న సన్నిహిత సంబంధాలే దీనికి కారణం. ‘హమ్ అదానీకే హై కౌన్’ సిరీస్‌లో మేము దీనిని మొదట మార్చి 3న ప్రస్తావించాము మరియు ఈ రోజు మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి అంటూ ఆయన ట్వీట్ చేశారు.

HAHK is beginning to bite. https://t.co/4sHat80Yl5

— Jairam Ramesh (@Jairam_Ramesh) April 7, 2023

ఈ వ్యాఖ్యలపై న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష పార్టీపై ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చేసిన ట్వీట్‌పై రిజిజు స్పందిస్తూ, “సున్నితమైన విషయాలపై వ్యాఖ్యానించవద్దు. అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి చైనా పౌరులతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని రమేష్ ఆరోపించారు. ఇది దేశ భద్రతకు విఘాతం కలిగిస్తోందా” అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన సరిహద్దు కంటే అభివృద్ధి చెందని సరిహద్దు సురక్షితమైనదని భారతదేశం చాలా కాలంగా సరిహద్దులను అభివృద్ధి చేయకూడదనే విధానాన్ని కలిగి ఉందని అప్పటి రక్షణ మంత్రి AK ఆంటోనీ లోక్‌సభలో ఉద్దేశపూర్వకంగా చెబుతున్న వీడియోను కూడా న్యాయ మంత్రి పంచుకున్నారు.
Also Read:Amit Shah: ప్రజాస్వామ్యం కాదు, రాజవంశమే ప్రమాదంలో ఉంది.. రాహుల్‌పై షా కీలక వ్యాఖ్యలు

మరోవైపు భారతదేశంలోని కీలకమైన ఓడరేవులు, ఎయిర్‌స్ట్రిప్‌లు, రైల్వే ట్రాక్‌లు, విద్యుత్ లైన్‌లను చైనా కంపెనీ ఎందుకు నిర్మిస్తోంది, నియంత్రిస్తోంది? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భారత సరిహద్దులో చైనా అనేక అతిక్రమణలు చేసి 20 మంది మన సైనికులను హతమార్చిందన్నారు. మరోవైపు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై అదానీ గ్రూప్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

संवेदनशील मामलों पर टिप्पणी न करें। कांग्रेस के पास अरुणाचल प्रदेश के बारे में बोलने का कोई नैतिक अधिकार नहीं है। पहले इस हकीकत का जवाब तो दो।👇 https://t.co/z33qP6JhPG pic.twitter.com/YiT4NtwMMf

— Kiren Rijiju (@KirenRijiju) April 6, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adani group
  • Chinese company
  • congress
  • national security

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions