Kishan Reddy : బంగారు తెలంగాణను పక్కకు పెట్టి… బంగారు కుటుంబం నిర్మించుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చైనా కమ్యునిస్టు పార్టీని వెనక్కి నెట్టేసి బీజేపీ పెద్ద పార్టీగా అవతరించిందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ.. బంగారు తెలగాణను పక్కకు పెట్టి… బంగారు కుటుంబం నిర్మించుకున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. దేశంలో తెలంగాణను నవ్వుల పాలు చేశారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. దేశంలో కుటుంబ పార్టీ లకు నాయకత్వం వహిస్తానని, ఖర్చు పెట్టుకుంటా అని కేసీఆర్ చెప్పడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 9 ఏళ్ళల్లో ఒక్క రోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదని, కేసీఆర్ సచివాలయానికి రారు.. పాలనను విస్మరించారని ఆయన ధ్వజమెత్తారు. కుట్రలు చేసి.. బీజేపీని అనిచివేయలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. TSPSC పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, ఆ విషయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని ఆయన దుయ్యబట్టారు. TSPSC లీకేజీ నీ ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Also Read : Ajith Antony : బీజేపీలో అనిల్ కరివేపాకు.. పార్టీ నుంచి గెంటేస్తారు..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
తెలంగాణలో ప్రాజెక్ట్ ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడానికి ప్రధాని మోడీ వస్తున్నారని, హైదరాబాద్ లో కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా MMTS పెడింగ్ పడిందన్నారు. వందే భారత్ రైలును హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు రేపు ప్రధాని ప్రారంభించనున్నారని, సికిద్రాబాదు రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులకు మోడీ శంకుస్థపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే స్వాగతం పలకాల్సిన రాష్ట్ర ప్రభుత్వo నిరసనలకు దిగుతుందని, రీజినల్ రింగ్ రోడ్డు ను కేంద్ర ప్రభుత్వం నిధులతో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. RRR కోసం భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిధులు ఇవ్వడం లేదని, కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ సమాజం బీజేపీని ఆశీర్వదిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Manish Sisodia: ప్రధాని మోడీకి తక్కువ అర్హతలు.. దేశానికి ప్రమాదకరం
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!