ఇవాళ ఢిల్లీకి సీఎం కేసీఆర్..కేంద్రంతో ఢీ అంటే ఢీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో అమీతుమీకి సిద్ధమయ్యారు. ప్రధానంగా మూడు డిమాండ్లతో కేసీఆర్ బృందం హస్తిన వెళ్తోంది. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం, రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో కుల గణన., తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీపై కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో సమరానికి సిద్ధమయ్యారు.
మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ధర్నాలు చేసినా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదని మండిపడ్డారు. దాన్యం కొనుగోళ్లపై ఇవాళ కేంద్ర పెద్దలతో మంత్రులు, అధికార బృందం చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్ కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ప్రధాని అపాయింట్ మెంట్ దొరికితే పలు అంశాలను ప్రస్తావించే యోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టే రైతులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని సీఎం డిమాండ్ చేశారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
రైతు పోరాటంలో మరణించిన 750 కుటుంబాలకు తెలంగాణ తరఫున 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. కేంద్రం కూడా ఒక్కో కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, గోదావరి, కృష్ణా నదుల నీటి పంపకాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు, విద్యుత్ చట్టం రద్దు తదితర అంశాలపై కూడా ఢిల్లీతో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ధర్నా చేసిన రోజున తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని అన్నారని… చివరి ప్రయత్నంగా ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. మరి కేసీఆర్ డిమాండ్లపై కేంద్ర పెద్దలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..