ఇవాళ ఢిల్లీకి సీఎం కేసీఆర్..కేంద్రంతో ఢీ అంటే ఢీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో అమీతుమీకి సిద్ధమయ్యారు. ప్రధానంగా మూడు డిమాండ్లతో కేసీఆర్ బృందం హస్తిన వెళ్తోంది. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం, రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో కుల గణన., తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీపై కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో సమరానికి సిద్ధమయ్యారు.
మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ధర్నాలు చేసినా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదని మండిపడ్డారు. దాన్యం కొనుగోళ్లపై ఇవాళ కేంద్ర పెద్దలతో మంత్రులు, అధికార బృందం చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్ కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ప్రధాని అపాయింట్ మెంట్ దొరికితే పలు అంశాలను ప్రస్తావించే యోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టే రైతులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని సీఎం డిమాండ్ చేశారు.
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
రైతు పోరాటంలో మరణించిన 750 కుటుంబాలకు తెలంగాణ తరఫున 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. కేంద్రం కూడా ఒక్కో కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, గోదావరి, కృష్ణా నదుల నీటి పంపకాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు, విద్యుత్ చట్టం రద్దు తదితర అంశాలపై కూడా ఢిల్లీతో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ధర్నా చేసిన రోజున తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని అన్నారని… చివరి ప్రయత్నంగా ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. మరి కేసీఆర్ డిమాండ్లపై కేంద్ర పెద్దలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
తాజావార్తలు
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
Rowdy Janardhana : రౌడీ కోసం ‘కన్నప్ప’ బ్యూటీ
-
Glenn Phillips-Reporter: అసలు అలా అడగొచ్చా.. రిపోర్టర్పై జీటీ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఫైర్!
-
NBK 111 : మనోజ్ విలన్ మాత్రమే కాదు.. అంతకుమించి
-
Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!