Chrisann Pereira: క్రిసన్ యు ఆర్ ఫ్రీ… కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ కేసులో ఇరుక్కుని యుఎఇలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు క్రిసన్ పెరీరా జైలు నుండి విడుదలయ్యారు. అనంతం ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. షార్జా జైలు నుండి విడుదలైన తర్వాత తన ఫ్యామిలీతో వీడియో కాల్లో మాట్లాడింది. ఈ సందర్భంగా నటి కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిసన్ పెరీరా సోదరుడు కెవిన్ పెరీరా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు క్రిసాన్ తల్లి ఆనందంతో గెంతుతున్నట్లు వీడియోలో ఉంది. క్రిసన్ యు ఆర్ ఫ్రీ అంటూ ఆనంద వ్యక్తం చేసింది. ఆమె వచ్చే 48 గంటల్లో భారత్లో ఉంటుంది అని కెవిన్ చెప్పాడు. ఆమె తల్లి మరియు ఇతర కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నటుడు కన్నీరుమున్నీరైంది. మీరు స్వేచ్ఛగా ఉన్నారు అని ఆమె తల్లి ప్రమీలా పెరీరా అడిగింది.
Also Read:Covid Cases: కరోనా తగ్గేదే లే.. కొత్తగా ఎన్ని కేసులంటే..
పెరీరాను ఏప్రిల్ 1న షార్జా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కుక్క విషయంలో జరిగిన గొడవ తర్వాత ప్రతీకారంగా బేకరీ యజమాని ఆ నటుడిని ఇరికించారని ముంబై క్రైమ్ బ్రాంచ్ తర్వాత కనుగొంది. బేకరీ యజమాని ఆంథోనీ పాల్, క్రిసాన్ పెరీరాను ఇరిక్కించేందుకు ఆంథోనీకి సహాయం చేసిన బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజేష్ బోభాటేలను పోలీసులు అరెస్ట్ చేశారు. కుక్క విషయంలో ఆంథోనీ సోదరి, నటి క్రిసాన్ తల్లితో గొడవపడిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరూ ఒకే భవనంలో నివసిస్తున్నారు. ఇదే అంశంపై నటి క్రిసన్ పెరీరాని డ్రగ్స్ కేసులో ఇరికించారని పోలీసులు అనుమానిస్తున్నారు. టాలెంట్ కన్సల్టెంట్గా ఉన్న రాజేష్ ద్వారా ఆంథోనీ నటిని సంప్రదించి షార్జాలో వెబ్ సిరీస్ కోసం ఆడిషన్ గురించి చెప్పాడు. అతను డ్రగ్స్ దాచిన ట్రోఫీని కూడా తీసుకెళ్లమని ఆమెను కోరినట్లు పోలీసులు తెలిపారు. క్రిసన్ పెరీరా పట్టుబడేలా అందులో గంజాయి దాచి ట్రోఫీని ఇచ్చాడు. క్రిసన్ దిగిన తర్వాత, నిందితుడు షార్జా విమానాశ్రయానికి కాల్ చేసి, ఆమె డ్రగ్స్ తీసుకువెళుతున్నట్లు అధికారులకు చెప్పాడని పోలీసులు తెలిపారు.
Also Read:Drugs Caught: కొకైన్ తరలించేందుకు కొత్త స్కెచ్.. అడ్డంగా బుక్కైన కిలాడి లేడి
Also Read
- Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
- PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
డ్రగ్స్తో పట్టుబడిన తర్వాత పెరీరాను విడుదల చేసేందుకు ఆమె కుటుంబం నుండి రూ. 80 లక్షలు డిమాండ్ చేశారు. ఇదే తరహాలో కనీసం ఐదుగురిని ట్రాప్ చేసేందుకు ఆంథోనీ, రాజేష్ కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు సంబంధిత పత్రాలను సంబంధిత అధికారులకు పంపారు. ఆ తర్వాత పెరీరాను బుధవారం రాత్రి విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, క్రిసన్ పెరీరా సడక్ 2, బాట్లా హౌస్ వంటి సినిమాల్లో నటించింది.
తాజావార్తలు
-
Sumanth: ‘నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..’ అంత మాట అనేశాడేంటి?
-
Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్గా ‘జో రూట్’ ఫిక్స్.. హెడ్ కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
-
Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్లైన్..
-
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
-
Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!