Chrisann Pereira: క్రిసన్ యు ఆర్ ఫ్రీ… కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ కేసులో ఇరుక్కుని యుఎఇలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు క్రిసన్ పెరీరా జైలు నుండి విడుదలయ్యారు. అనంతం ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. షార్జా జైలు నుండి విడుదలైన తర్వాత తన ఫ్యామిలీతో వీడియో కాల్లో మాట్లాడింది. ఈ సందర్భంగా నటి కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిసన్ పెరీరా సోదరుడు కెవిన్ పెరీరా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు క్రిసాన్ తల్లి ఆనందంతో గెంతుతున్నట్లు వీడియోలో ఉంది. క్రిసన్ యు ఆర్ ఫ్రీ అంటూ ఆనంద వ్యక్తం చేసింది. ఆమె వచ్చే 48 గంటల్లో భారత్లో ఉంటుంది అని కెవిన్ చెప్పాడు. ఆమె తల్లి మరియు ఇతర కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నటుడు కన్నీరుమున్నీరైంది. మీరు స్వేచ్ఛగా ఉన్నారు అని ఆమె తల్లి ప్రమీలా పెరీరా అడిగింది.
Also Read:Covid Cases: కరోనా తగ్గేదే లే.. కొత్తగా ఎన్ని కేసులంటే..
పెరీరాను ఏప్రిల్ 1న షార్జా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కుక్క విషయంలో జరిగిన గొడవ తర్వాత ప్రతీకారంగా బేకరీ యజమాని ఆ నటుడిని ఇరికించారని ముంబై క్రైమ్ బ్రాంచ్ తర్వాత కనుగొంది. బేకరీ యజమాని ఆంథోనీ పాల్, క్రిసాన్ పెరీరాను ఇరిక్కించేందుకు ఆంథోనీకి సహాయం చేసిన బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజేష్ బోభాటేలను పోలీసులు అరెస్ట్ చేశారు. కుక్క విషయంలో ఆంథోనీ సోదరి, నటి క్రిసాన్ తల్లితో గొడవపడిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరూ ఒకే భవనంలో నివసిస్తున్నారు. ఇదే అంశంపై నటి క్రిసన్ పెరీరాని డ్రగ్స్ కేసులో ఇరికించారని పోలీసులు అనుమానిస్తున్నారు. టాలెంట్ కన్సల్టెంట్గా ఉన్న రాజేష్ ద్వారా ఆంథోనీ నటిని సంప్రదించి షార్జాలో వెబ్ సిరీస్ కోసం ఆడిషన్ గురించి చెప్పాడు. అతను డ్రగ్స్ దాచిన ట్రోఫీని కూడా తీసుకెళ్లమని ఆమెను కోరినట్లు పోలీసులు తెలిపారు. క్రిసన్ పెరీరా పట్టుబడేలా అందులో గంజాయి దాచి ట్రోఫీని ఇచ్చాడు. క్రిసన్ దిగిన తర్వాత, నిందితుడు షార్జా విమానాశ్రయానికి కాల్ చేసి, ఆమె డ్రగ్స్ తీసుకువెళుతున్నట్లు అధికారులకు చెప్పాడని పోలీసులు తెలిపారు.
Also Read:Drugs Caught: కొకైన్ తరలించేందుకు కొత్త స్కెచ్.. అడ్డంగా బుక్కైన కిలాడి లేడి
Also Read
డ్రగ్స్తో పట్టుబడిన తర్వాత పెరీరాను విడుదల చేసేందుకు ఆమె కుటుంబం నుండి రూ. 80 లక్షలు డిమాండ్ చేశారు. ఇదే తరహాలో కనీసం ఐదుగురిని ట్రాప్ చేసేందుకు ఆంథోనీ, రాజేష్ కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు సంబంధిత పత్రాలను సంబంధిత అధికారులకు పంపారు. ఆ తర్వాత పెరీరాను బుధవారం రాత్రి విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, క్రిసన్ పెరీరా సడక్ 2, బాట్లా హౌస్ వంటి సినిమాల్లో నటించింది.
తాజావార్తలు
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
-
TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
ట్రెండింగ్
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!