PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
- మోడీ హైలెవల్ మీటింగ్
- సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ
- అజెండాపై సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ కేంద్ర సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య, ఆరోగ్య శాఖలకు చెందిన కీలక మంత్రులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేబినెట్ కార్యదర్శి పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో చర్చిస్తున్న అంశాలు, అధికారిక అజెండా ఏమిటన్నది మాత్రం వెల్లడికాలేదు. దీంతో ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. అలాగే ఆరోగ్యం, రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అలాగే కేబినెట్ కార్యదర్శితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా సమావేశంలో ఉన్నారు. దేశ భద్రత, అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశాలు లేదా ఇతర కీలక విధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే సమావేశానికి సంబంధించిన అధికారిక అజెండాను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు.
Also Read
- Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?
- Indian Railways: RAC టికెట్కు పూర్తి ఛార్జీ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన రైల్వే శాఖ
- CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
- West Bengal Cash Haul: ఎక్స్- బస్ డ్రైవర్ ఇంట్లో రూ. 28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం..
మధ్యప్రాచ్యంలో తాజాగా ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇరాన్పై అమెరికా కొత్తగా దాడులు చేయడం, హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం మీదుగా జరిగే అంతర్జాతీయ నౌకా రవాణాకు కొనసాగుతున్న ముప్పు వంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకు ఎదురవుతున్న ముప్పు వంటి అంశాలు గురువారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చాయా లేదా అన్నది స్పష్టంగా తెలియలేదు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
-
Mohammed Shami: మరో పిడుగులాంటి వార్త.. ఇక మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్!
-
Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?