PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
- మోడీ హైలెవల్ మీటింగ్
- సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ
- అజెండాపై సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ కేంద్ర సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య, ఆరోగ్య శాఖలకు చెందిన కీలక మంత్రులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేబినెట్ కార్యదర్శి పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో చర్చిస్తున్న అంశాలు, అధికారిక అజెండా ఏమిటన్నది మాత్రం వెల్లడికాలేదు. దీంతో ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. అలాగే ఆరోగ్యం, రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అలాగే కేబినెట్ కార్యదర్శితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా సమావేశంలో ఉన్నారు. దేశ భద్రత, అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశాలు లేదా ఇతర కీలక విధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే సమావేశానికి సంబంధించిన అధికారిక అజెండాను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు.
Also Read
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
మధ్యప్రాచ్యంలో తాజాగా ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇరాన్పై అమెరికా కొత్తగా దాడులు చేయడం, హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం మీదుగా జరిగే అంతర్జాతీయ నౌకా రవాణాకు కొనసాగుతున్న ముప్పు వంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకు ఎదురవుతున్న ముప్పు వంటి అంశాలు గురువారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చాయా లేదా అన్నది స్పష్టంగా తెలియలేదు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?