NDA Govt: వక్ఫ్ బిల్లు, వన్ నేషన్-వన్ ఎలక్షన్.. బీజేపీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
- పార్లమెంట్ తొలి శీతాకాల సమావేశాలకు రెండు నెలల సమయం
- వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం
- వక్ఫ్ బిల్లు.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లులకు కేబినెట్ ఆమోదం
- బీజేపీ నెక్ట్స్ ప్లాన్ ఏంటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ తొలి శీతాకాల సమావేశాలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయితే ఈ సమావేశాలు రాజకీయ వేడెక్కే సూచనలు ఇప్పటికే వెలువడుతున్నాయి. వక్ఫ్ బిల్లు, వన్ నేషన్-వన్ ఎలక్షన్ వంటి అంశాలు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో నిప్పుపుట్టించనున్నాయి. నెక్స్ట్ అంతకు మించిన కొత్త బిల్లులు ప్రభుత్వ అజెండాలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టవచ్చు.
READ MORE: Kondapalli Srinivas: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తాం..
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హోం మంత్రి అమిత్ షా విలేకరుల సమావేశం నిర్వహించి, సాధించిన విజయాలను వివరించారు. దీంతోపాటు రాబోయే ఎజెండా గురించి కూడా సూచనలు ఇచ్చారు. వక్ఫ్ చట్టానికి సవరణలు చేసేందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రెండు బిల్లులను తీసుకొచ్చింది. ప్రతిపక్ష పార్టీలు దీనికి వ్యతిరేకంగా గళం విప్పగా, ఎన్డీఏ సభ్యులు కూడా సమగ్ర చర్చ కోసం స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి పంపారు. ఇందుకోసం జగదాంబిక పాల్ నేతృత్వంలో జేపీసీని ఏర్పాటు చేశారు. జేపీసీ మారథాన్ సమావేశాల మధ్య అమిత్ షా ఈ బిల్లు వచ్చే సెషన్లో వస్తుందని సూచించారు.
READ MORE: Jr NTR : వెయ్యి కోట్ల డైరెక్టర్తో ‘ఎన్టీఆర్’?
త్వరలో జన గణన: అమిత్ షా
విలేఖరుల సమావేశంలో షా మాట్లాడుతూ.. వక్ఫ్ (సవరణ) బిల్లు వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిరక్షణకు సంబంధించినదని, రానున్న రోజుల్లో పార్లమెంటులో ఆమోదం పొందుతుందని, వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని కూడా అరికట్టేందుకు బిల్లు ఉంటుందన్నారు. ప్రభుత్వం త్వరలో జన గణన కూడా ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021 నుంచి పెండింగ్లో ఉన్న జనాభా లెక్కలు అతి త్వరలో ప్రారంభమవుతాయని అమిత్ షా చెప్పారు. జనాభా గణనకు సన్నాహాలు ప్రారంభించామని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందన్నారు. జనాభా గణనలో కులాల లెక్కింపుపై ప్రశ్నకు, అది ప్రకటించినప్పుడు.. మొత్తం సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ అంశంపై చర్చ జరుగుతోంది.
READ MORE:India-Russia : తప్పుడు కథనాలతో.. భారత్పై బురద చల్లేందుకు యత్నిస్తున్న అంతర్జాతీయ మీడియా!
జనాభా గణనలో కులాల లెక్కింపు..?
దేశ రాజకీయాల్లోనూ కుల గణన అంశం హాట్ హాట్ గా సాగుతోంది. బీహార్లో ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ కుల గణనను పేర్కొంటూ బీజేపీని కార్నర్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కుల గణనను బలవంతంగా నిర్వహించేలా మాట్లాడుతున్నారు. అదే సమయంలో.. హర్యానాలో, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కుల గణనను నిర్వహిస్తుందని హామీ ఇచ్చింది. అనుప్రియా పటేల్ అప్నా దళ్ (S) నుంచి చిరాగ్ పాశ్వాన్ కి చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) వరకు అందరూ కుల గణనకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. ఇందుకు సంఘ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!