చిరంజీవితో పాటు మహేశ్, బన్నీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఆంధ్రప్రదేశ్ సమాచార, రవాణ శాఖా మంత్రి పేర్ని నాని మెగా స్టార్ చిరంజీవికి ఫోన్ చేసి… సినిమా రంగానికి సంబంధించిన సమస్యలను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్ కు నివేదించాల్సిందిగా కోరారు. దాంతో చిరంజీవి తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు సురేశ్ బాబు, ‘దిల్’ రాజు, అక్కినేని నాగార్జున, బీవీఎస్ఎన్ ప్రసాద్, సుప్రియ, దామోదర ప్రసాద్, నారాయణ దాస్ నారంగ్ తదితరులతో కలిసి సమావేశమయ్యారు. చిత్రసీమకు చెందిన ఏ యే సమస్యలను జగన్ ముందు పెట్టాలనే దానిపై వీరంతా కలిసి భారీ కసరత్తు చేశారు.
Read Also: 4 కోట్ల అడ్వాన్స్ తిరిగి ఇచ్చిన నవీన్ పోలిశెట్టి!?
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో యాభై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తున్నాయి. దానికి తోడు థియేటర్ల టిక్కెట్ రేట్లు పెంచకూడదని జగన్ ప్రభుత్వం చెప్పడంతో చాలామంది ఎగ్జిబిటర్స్ థియేటర్లను ఇంకా తెరవలేదు. ఈ నేపథ్యంలో టిక్కెట్ రేట్ల అంశానికి చిరంజీవి బృందం అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆస్కారం కనిపిస్తోంది. దానితో పాటే థియేటర్ల ఆక్యుపెన్సీ, ఐదు ఆటల ప్రదర్శన, థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా జగన్ దృష్టికి తీసుకెళ్ళబోతున్నారట.
Read Also: తన ఊబకాయం గురించి మాట్లాడిన ఎన్టీఆర్
తాజా సమాచారం ప్రకారం జగన్ ను చిరంజీవి బృందం సెప్టెంబర్ 4న కలువబోతోందని తెలుస్తోంది. జగన్ ను కలిసే బృందంలో ఇప్పుడు ప్రిన్స్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేర్లూ వినిపిస్తున్నాయి. చిరంజీవి వీరిద్దరినీ తప్పకుండా తనతో రావాలని కోరారట. అయితే వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదని అంటున్నారు. చిరంజీవితో పాటు అల్లు అర్జున్ కూడా జగన్ ను కలవడానికి వెళ్ళడంలో పెద్దంత వింతేమీ లేదు. కానీ మహేశ్ సైతం జగన్ ను కలవడానికి అంగీకరిస్తే అది ఆసక్తికరమైన అంశమే.
Read Also: మీడియాపై స్టార్ హీరోయిన్ సెటైర్!
ఎందుకంటే… ఇటీవలే మహేశ్ బావ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ కంపెనీపై జగన్ ప్రభుత్వం కాలుష్య నివారణ విషయంలో నిర్లక్ష్యం చూపిన కారణంగా కఠిన చర్యలకు ఆదేశించింది. దాంతో జగన్ ప్రభుత్వానికి గల్లా ఫ్యామిలీకి మధ్య కనిపించని వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు… ఏపీ సీఎం జగన్ ను కలవడం ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. చూద్దాం… మరి ఏం జరుగుతుందో!!
తాజావార్తలు
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!