చిరంజీవితో పాటు మహేశ్, బన్నీ!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ సమాచార, రవాణ శాఖా మంత్రి పేర్ని నాని మెగా స్టార్ చిరంజీవికి ఫోన్ చేసి… సినిమా రంగానికి సంబంధించిన సమస్యలను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్ కు నివేదించాల్సిందిగా కోరారు. దాంతో చిరంజీవి తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు సురేశ్ బాబు, ‘దిల్’ రాజు, అక్కినేని నాగార్జున, బీవీఎస్ఎన్ ప్రసాద్, సుప్రియ, దామోదర ప్రసాద్, నారాయణ దాస్ నారంగ్ తదితరులతో కలిసి సమావేశమయ్యారు. చిత్రసీమకు చెందిన ఏ యే సమస్యలను జగన్ ముందు పెట్టాలనే దానిపై వీరంతా కలిసి భారీ కసరత్తు చేశారు.
Read Also: 4 కోట్ల అడ్వాన్స్ తిరిగి ఇచ్చిన నవీన్ పోలిశెట్టి!?
Also Read
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో యాభై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తున్నాయి. దానికి తోడు థియేటర్ల టిక్కెట్ రేట్లు పెంచకూడదని జగన్ ప్రభుత్వం చెప్పడంతో చాలామంది ఎగ్జిబిటర్స్ థియేటర్లను ఇంకా తెరవలేదు. ఈ నేపథ్యంలో టిక్కెట్ రేట్ల అంశానికి చిరంజీవి బృందం అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆస్కారం కనిపిస్తోంది. దానితో పాటే థియేటర్ల ఆక్యుపెన్సీ, ఐదు ఆటల ప్రదర్శన, థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా జగన్ దృష్టికి తీసుకెళ్ళబోతున్నారట.
Read Also: తన ఊబకాయం గురించి మాట్లాడిన ఎన్టీఆర్
తాజా సమాచారం ప్రకారం జగన్ ను చిరంజీవి బృందం సెప్టెంబర్ 4న కలువబోతోందని తెలుస్తోంది. జగన్ ను కలిసే బృందంలో ఇప్పుడు ప్రిన్స్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేర్లూ వినిపిస్తున్నాయి. చిరంజీవి వీరిద్దరినీ తప్పకుండా తనతో రావాలని కోరారట. అయితే వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదని అంటున్నారు. చిరంజీవితో పాటు అల్లు అర్జున్ కూడా జగన్ ను కలవడానికి వెళ్ళడంలో పెద్దంత వింతేమీ లేదు. కానీ మహేశ్ సైతం జగన్ ను కలవడానికి అంగీకరిస్తే అది ఆసక్తికరమైన అంశమే.
Read Also: మీడియాపై స్టార్ హీరోయిన్ సెటైర్!
ఎందుకంటే… ఇటీవలే మహేశ్ బావ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ కంపెనీపై జగన్ ప్రభుత్వం కాలుష్య నివారణ విషయంలో నిర్లక్ష్యం చూపిన కారణంగా కఠిన చర్యలకు ఆదేశించింది. దాంతో జగన్ ప్రభుత్వానికి గల్లా ఫ్యామిలీకి మధ్య కనిపించని వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు… ఏపీ సీఎం జగన్ ను కలవడం ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. చూద్దాం… మరి ఏం జరుగుతుందో!!
తాజావార్తలు
-
Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్.. పాన్ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!
-
UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
-
Vishwambhara : విశ్వంభర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్
-
Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
-
Hyderabad Honeytrap: తల్లి సహకారంతోనే కొడుకుల ‘రొమాంటిక్’ ట్రాప్.. రంగంలోకి సీపీ సజ్జనార్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!