హైకమాండ్ నిర్ణయంతోనే సీఎంతో సమావేశానికి వెళ్లా: భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు నడుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో రాహుల్ వర్గం, సోనియా వర్గంగా నేతలు ఉంటారు తప్ప స్థానిక నేతలకు వర్గాలు ఉండవన్నారు. పార్టీలో వర్గాలు ఉన్నాయని ఎవరైనా అలా ఊహించుకుంటే వాళ్ల పొరపాటేనన్నారు. అయితే వ్యక్తులకు భిన్నాభిప్రాయాలు ఉంటాయని…. భావ వ్యక్తీకరణ అనేది మన దేశంలో ప్రజాస్వామ్య లక్షణమని ఆయన గుర్తుచేశారు.
ఒక్కోసారి మన భావాలను వ్యక్తీకరించినప్పుడు భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయని.. వాటిని కొట్లాటలుగా చూడటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని భట్టి విక్రమార్క తెలిపారు.
Also Read
- Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్కు వార్నింగ్
- Trump: ఫుట్బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
- Nirav Modi: నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధం! మూసుకున్న న్యాయ మార్గాలు
- Taj Mahal: తాజ్మహల్పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు
దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని.. మిగతా పార్టీల నేతల దృష్టి మరల్చడానికి రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలోని బీజేపీ కలిసి కుట్రపన్నాయని… అందుకే ముందస్తు ఎన్నికలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావు అనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ రాసిన విషయం హాట్ టాపిక్గా మారగా.. జగ్గారెడ్డి లేఖ రాసిన విషయం తాను పత్రికల ద్వారానే తెలుసుకున్నానని భట్టి తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గానికి తనకు సమాచారం ఇవ్వకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రావడాన్ని జగ్గారెడ్డి తప్పుబట్టగా.. ఆయనకు సమాచారం లోపించడంపై స్వయంగా మాట్లాడి తెలుసుకుంటానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
మరోవైపు సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి తాను వెళ్లడంపై పార్టీలో వ్యతిరేకత రావడంపైనా భట్టి విక్రమార్క స్పందించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను సీఎం కేసీఆర్తో సమావేశానికి వెళ్లానని కొందరు ప్రచారం చేస్తున్నారని.. తాను పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఉమ్మడి నిర్ణయంతోనే దళిత బంధు అంశంపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి వెళ్లానని భట్టి స్పష్టం చేశారు. కేసీఆర్తో కుమ్మక్కు అంటూ తనపై ప్రచారం చేయడంతో బాధపడ్డానని తెలిపారు. సీఎంతో తాను భేటీ కావడంపై స్పష్టత ఇవ్వాలని రేవంత్, మాణిక్యం ఠాగూర్లను అడిగానని… ఈరోజు వరకు వారు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.
తాజావార్తలు
-
Dada: గంగూలీ బయోపిక్ నుంచి బర్త్డే ట్రీట్.. ‘దాదా’ ఫస్ట్ లుక్కు టైమ్ ఫిక్స్
-
Kommidi Narasimha Reddy: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు!
-
Ethnic Unity Law: ముస్లింలే టార్గెట్.. కమ్యూనిస్టు దేశంలో మైనార్టిలపై అణచివేత చట్టాలు!
-
YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్కు నివాళి
-
Aakasamlo Oka Tara: సెట్స్ నుంచి దుల్కర్ సల్మాన్ షేర్ చేసిన BTS ఫొటో వైరల్.. పెరిగిన అంచనాలు
ట్రెండింగ్
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!