Bhagwant Mann: పంజాబ్ మరో ఆఫ్ఘనిస్తాన్ కాకూడదు.. మతోన్మాద శక్తులతో జాగ్రత
ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్పాల్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అమృత్పాల్ అరెస్టు.. ఎలాంటి పర్యవసానాలకు దారి తీసే అవకాశముందోననే ఆందోళనతో ఇప్పుడు రాష్ట్రంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని మతోన్మాద ప్రాతిపదికన విభజించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అయితే పంజాబ్ వ్యతిరేక శక్తుల దుర్మార్గపు ఆకృతులను తిప్పికొట్టడం ద్వారా పంజాబ్ను ప్రగతిశీల,శాంతియుత,సంపన్న రాష్ట్రంగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Also Read:Kotamreddy Sridhar Reddy: టీడీపీ ఎమ్మెల్యేలను మీరెన్ని కోట్లకు కొన్నారు..?
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
తమ ప్రభుత్వం పంజాబ్లో శాంతి, మత సామరస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తుందన్నారు. యువత మతం పేరుతో చేసే చర్యలను అనుమతించబోమని ఆయన తెలిపారు. పంజాబ్లో విద్యను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. ప్రజలతో ఎటువంటి భావోద్వేగ బంధం లేని స్వయం ప్రకటిత బోధకుల ఆలోచనలకు పంజాబీలు లొంగిపోకూడదని సీఎం మాన్ సూచించారు. తనపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మన్.. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.
ఖలిస్థాన్ అనుకూల బోధకుడు అమృతపాల్ సింగ్, అతని సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’పై పోలీసుల నిఘా కొనసాగుతోంది. అమృతపాల్ సింగ్ను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతని సహచరులు అనేక మంది అరెస్టు చేశారు. అమృతపాల్ సింగ్తో సహా వారిలో కొందరిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం ప్రయోగించారు.
Also Read:7th Pay Commission: కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త.. డీఏ 4 శాతం పెంపు
ఖలిస్తాన్ అనుకూల నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ పంజాబ్ యువతకు ఆరాధ్య నేతగా ఎదిగాడు. ఖలిస్తాన్ అనుకూల వాదంలో బింద్రన్ వాలే ఫాలో అయిన రాడికల్ విధానాలనే అనుసరిస్తున్నారు. ఈ రాడికల్ సంస్థను పంజాబీల హక్కుల పరిరక్షణ కోసం దీప్ సిద్ధూ ప్రారంభించారు. అయితే గతేడాది జరిగిన ఒక ప్రమాదంలో దీప్ సిద్ధూ మరణించారు. దాంతో అమృత్ పాల్ సింగ్ వారిస్ పంజాబ్ దే బాధ్యతలను చేపట్టారు.
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో