Bhagwant Mann: పంజాబ్ మరో ఆఫ్ఘనిస్తాన్ కాకూడదు.. మతోన్మాద శక్తులతో జాగ్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్పాల్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అమృత్పాల్ అరెస్టు.. ఎలాంటి పర్యవసానాలకు దారి తీసే అవకాశముందోననే ఆందోళనతో ఇప్పుడు రాష్ట్రంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని మతోన్మాద ప్రాతిపదికన విభజించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అయితే పంజాబ్ వ్యతిరేక శక్తుల దుర్మార్గపు ఆకృతులను తిప్పికొట్టడం ద్వారా పంజాబ్ను ప్రగతిశీల,శాంతియుత,సంపన్న రాష్ట్రంగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Also Read:Kotamreddy Sridhar Reddy: టీడీపీ ఎమ్మెల్యేలను మీరెన్ని కోట్లకు కొన్నారు..?
Also Read
- Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
తమ ప్రభుత్వం పంజాబ్లో శాంతి, మత సామరస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తుందన్నారు. యువత మతం పేరుతో చేసే చర్యలను అనుమతించబోమని ఆయన తెలిపారు. పంజాబ్లో విద్యను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. ప్రజలతో ఎటువంటి భావోద్వేగ బంధం లేని స్వయం ప్రకటిత బోధకుల ఆలోచనలకు పంజాబీలు లొంగిపోకూడదని సీఎం మాన్ సూచించారు. తనపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మన్.. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.
ఖలిస్థాన్ అనుకూల బోధకుడు అమృతపాల్ సింగ్, అతని సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’పై పోలీసుల నిఘా కొనసాగుతోంది. అమృతపాల్ సింగ్ను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతని సహచరులు అనేక మంది అరెస్టు చేశారు. అమృతపాల్ సింగ్తో సహా వారిలో కొందరిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం ప్రయోగించారు.
Also Read:7th Pay Commission: కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త.. డీఏ 4 శాతం పెంపు
ఖలిస్తాన్ అనుకూల నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ పంజాబ్ యువతకు ఆరాధ్య నేతగా ఎదిగాడు. ఖలిస్తాన్ అనుకూల వాదంలో బింద్రన్ వాలే ఫాలో అయిన రాడికల్ విధానాలనే అనుసరిస్తున్నారు. ఈ రాడికల్ సంస్థను పంజాబీల హక్కుల పరిరక్షణ కోసం దీప్ సిద్ధూ ప్రారంభించారు. అయితే గతేడాది జరిగిన ఒక ప్రమాదంలో దీప్ సిద్ధూ మరణించారు. దాంతో అమృత్ పాల్ సింగ్ వారిస్ పంజాబ్ దే బాధ్యతలను చేపట్టారు.
తాజావార్తలు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?