Kotamreddy Sridhar Reddy: టీడీపీ ఎమ్మెల్యేలను మీరెన్ని కోట్లకు కొన్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotamreddy Sridhar Reddy: ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాకరేపుతున్నాయి.. 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. అనూహ్యంగా ఓ స్థానాన్ని 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించారు.. దీంతో, అధికార వైసీపీకి షాక్ తగిలింది.. ఆరు స్థానాలకే పరిమితం అయ్యింది.. ఇక, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇదే సమయంలో.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు, రూ.20 కోట్లు ఇచ్చారని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. వైసీపీ కామెంట్లపై ఘాటుగా స్పందించారు..
Read Also: Mekapati Chandra Sekhar Reddy: స్పెన్షన్ సంతోషం.. రూ.20 కోట్లు ఇచ్చారని సజ్జల ప్రమాణం చేస్తారా?
Also Read
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కానీ, టీడీపీ కానీ.. నన్ను ఓటు అడగలేదన్నారు కోటంరెడ్డి.. ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తాను అని చెప్పా.. ఆ మేరకు ఓటు వేశానని తెలిపారు.. ఇదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను మీరెన్ని కోట్లకు కొన్నారు సజ్జల అంటూ నిలదీశారు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. అయితే, చేతిలో అధికారం ఉందని సస్పెండ్ చేశారు.. కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని మండిపడ్డారు…. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం.. పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తోందని వ్యాఖ్యానించారు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి..
తాజావార్తలు
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!