7th Pay Commission: కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త.. డీఏ 4 శాతం పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
7th Pay Commission: కేంద్రంలోని మోదీ సర్కారు ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డియర్నెస్ అలవెన్స్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరువు భత్యాన్ని 38 శాతం నుంచి 42 శాతానికి పెంచారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో, కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని పెంచుతుంది. తద్వారా వారు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందవచ్చు.
Read Also: Manoj Sinha: మహాత్మాగాంధీ డిగ్రీ చేయలేదు.. జమ్మూకశ్మీర్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత, కోటి మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. ఉద్యోగులు, పింఛనుదారులకు డియర్నెస్ అలవెన్స్ అనేది లేబర్ బ్యూరో జారీ చేసిన ఇండస్ట్రియల్ వర్కర్స్ (CPI-IW) కోసం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా లెక్కించబడుతుంది.
కేంద్ర ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్, పింఛనుదారుల డియర్నెస్ రిలీఫ్ పెంపు నిర్ణయం జనవరి 1, 2023 నుండి వర్తించేలా పరిగణించబడుతుంది. అంటే ఉద్యోగులు, పింఛనుదారులకు డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ పెంపు నిర్ణయం తర్వాత ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.12,815.60 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయంతో 47.58 లక్షల మంది ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయించిన ఫార్ములా ఆధారంగా ఈ పెంపుదల జరిగింది. డియర్నెస్ అలవెన్స్ పెంపు కారణంగా కేంద్ర ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల ఉంటుంది. ఉదాహరణకు కేంద్ర ఉద్యోగి మూల వేతనం రూ.25500 అనుకుందాం. 38 శాతం డీఏ ప్రకారం ఇప్పుడు రూ.9690 అందుబాటులో ఉంది. డీఏ 42 శాతంగా మారితే డియర్నెస్ అలవెన్స్ రూ.10,710కి పెరుగుతుంది. అంటే ప్రతి నెలా జీతం రూ.1020 పెరుగుతుంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..