7th Pay Commission: కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త.. డీఏ 4 శాతం పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
7th Pay Commission: కేంద్రంలోని మోదీ సర్కారు ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డియర్నెస్ అలవెన్స్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరువు భత్యాన్ని 38 శాతం నుంచి 42 శాతానికి పెంచారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో, కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని పెంచుతుంది. తద్వారా వారు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందవచ్చు.
Read Also: Manoj Sinha: మహాత్మాగాంధీ డిగ్రీ చేయలేదు.. జమ్మూకశ్మీర్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
Also Read
కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత, కోటి మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. ఉద్యోగులు, పింఛనుదారులకు డియర్నెస్ అలవెన్స్ అనేది లేబర్ బ్యూరో జారీ చేసిన ఇండస్ట్రియల్ వర్కర్స్ (CPI-IW) కోసం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా లెక్కించబడుతుంది.
కేంద్ర ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్, పింఛనుదారుల డియర్నెస్ రిలీఫ్ పెంపు నిర్ణయం జనవరి 1, 2023 నుండి వర్తించేలా పరిగణించబడుతుంది. అంటే ఉద్యోగులు, పింఛనుదారులకు డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ పెంపు నిర్ణయం తర్వాత ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.12,815.60 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయంతో 47.58 లక్షల మంది ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయించిన ఫార్ములా ఆధారంగా ఈ పెంపుదల జరిగింది. డియర్నెస్ అలవెన్స్ పెంపు కారణంగా కేంద్ర ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల ఉంటుంది. ఉదాహరణకు కేంద్ర ఉద్యోగి మూల వేతనం రూ.25500 అనుకుందాం. 38 శాతం డీఏ ప్రకారం ఇప్పుడు రూ.9690 అందుబాటులో ఉంది. డీఏ 42 శాతంగా మారితే డియర్నెస్ అలవెన్స్ రూ.10,710కి పెరుగుతుంది. అంటే ప్రతి నెలా జీతం రూ.1020 పెరుగుతుంది.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!