Asaduddin Owaisi: కేసీఆర్ కుటుంబాన్ని వేధించడంలో మోదీ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను హాజరవుతున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ మీద విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎంపీలు ముస్లింలను ఆర్థికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ముస్లింలను ఎదుర్కొనేందుకు ప్రజలు తమ ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలన్నారు. కానీ మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని వేధించడంలో బిజీగా ఉంది అంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు.
Also Read:Facebook: ఉద్యోగులకు మెటా షాక్.. ఉద్యోగులపై వేటుకు ప్లాన్ !
Also Read
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
కాగా.. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ హాజరువుతున్నారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో మంత్రులు కేటీఆర్, హరీష్రావుతో కవిత భేటీ అయ్యారు. ఢిల్లీలో కవితకు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకుని కవితను కలిశారు. కవిత విచారణతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కవితను ఏ ఏ ప్రశ్నలు అడుతారు అన్నది ఉత్కంఠ రేపుతోంది.
Also Read:Dhruvanarayan: గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
కవిత విచారణ సందర్భంగా ఆమెకు మద్దతుగా ఫ్లెక్సీలు, పోస్టర్లూ ఆసక్తికరంగా మారాయి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ కొంతమంది బీజేపీ నేతల ఫొటోలతో ఈ పోస్టర్లు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు…సీబీఐ, ఈడీ దాడులు జరగగానే.. కాషాయరంగు పూసుకుని.. బీజేపీలో చేరిపోయారంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేంధు అధికారి, ఎంపీ సుజనా చౌదరి తదితరుల ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి.
తాజావార్తలు
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!