Asaduddin Owaisi: కేసీఆర్ కుటుంబాన్ని వేధించడంలో మోదీ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను హాజరవుతున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ మీద విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎంపీలు ముస్లింలను ఆర్థికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ముస్లింలను ఎదుర్కొనేందుకు ప్రజలు తమ ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలన్నారు. కానీ మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని వేధించడంలో బిజీగా ఉంది అంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు.
Also Read:Facebook: ఉద్యోగులకు మెటా షాక్.. ఉద్యోగులపై వేటుకు ప్లాన్ !
Also Read
కాగా.. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ హాజరువుతున్నారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో మంత్రులు కేటీఆర్, హరీష్రావుతో కవిత భేటీ అయ్యారు. ఢిల్లీలో కవితకు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకుని కవితను కలిశారు. కవిత విచారణతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కవితను ఏ ఏ ప్రశ్నలు అడుతారు అన్నది ఉత్కంఠ రేపుతోంది.
Also Read:Dhruvanarayan: గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
కవిత విచారణ సందర్భంగా ఆమెకు మద్దతుగా ఫ్లెక్సీలు, పోస్టర్లూ ఆసక్తికరంగా మారాయి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ కొంతమంది బీజేపీ నేతల ఫొటోలతో ఈ పోస్టర్లు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు…సీబీఐ, ఈడీ దాడులు జరగగానే.. కాషాయరంగు పూసుకుని.. బీజేపీలో చేరిపోయారంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేంధు అధికారి, ఎంపీ సుజనా చౌదరి తదితరుల ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?