మెటా సంస్థ మరోసారి తమ ఉద్యోగులకు మరో షాక్ ఇవ్వనుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు యోచిస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో దశల వారిగి ఉద్యోగులను తొలగిచేందుకు సిద్ధమైంది. వేల మందిపై వేటు వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది మెటా.. సుమారు 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.ఇది అప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల్లో 13 శాతానికి సమానం. ఈ సారి కూడా దాదాపు 11 వేల మంది వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
Also Read: Mlc Kavitha: బై బై మోదీ.. కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు..
ఉద్యోగులపై వేటుకు సంబంధించి మెటా సంస్థ వచ్చే వారం తొలి ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. నాన్- ఇంజినీరింగ్ రోల్స్లో పనిచేస్తున్న ఉద్యోగులను అధికంగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగుల వేటు ఉండనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా, మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్బర్గ్ ఉద్యోగుల తొలగింపుపై గతంలోనే పరోక్ష సూచన చేశారు. కొన్ని ప్రాజెక్టులను నిలిపివేయనున్నట్లు అప్పట్లోనే వెల్లడించారు.
Also Read:Congress Leader Azharuddin: అవకాశమిస్తే కామారెడ్డి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తా
2022లో మొదలైన ఈ లేఆఫ్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వంటి బడా కంపెనీలు భారీగా ఉద్యోగులపై వేటు వేశాయి. గూగుల్ సైతం 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇటీవల వెల్లడించింది. 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం తొలగించిన ఉద్యోగుల సంఖ్య 3లక్షలు దాటిందని అంచనా. 2023లో ఇప్పటి వరకు 340 కంపెనీలు 1.10 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయని అంచనా. కాగా, ఉద్యోగులకు ఉద్వాసన పలికిన కంపెనీల్లో యాహూ, బైజూస్, గోడ్యాడీ, గిట్హబ్, ఇబే, ఆటోడెస్క్, ఓఎల్ఎక్స్ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఆర్థిక మాంద్యం భయాలు రోజురోజుకీ బలపడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ తొలగింపులు కొనసాగనున్నాయి.