తిరుపతిలో అమరావతి రైతుల సభకు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్కంఠ వీడిపోయింది. తిరుపతిలో బహిరంగసభకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభ అనుమతిపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరుపు వాదనలు వినిపించారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పిటిషనర్ల తరుపు వాదనలు వినిపించారు న్యాయవాది లక్ష్మీనారాయణ.
తిరుపతిలో రాజధాని రైతుల బహిరంగ సభ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తిరుపతి బహిరంగ సభకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా జేఏసీ బహిరంగ సభకు అనుమతించాలని కోరారు పిటిషనర్లు. తిరుపతి రూరల్ పరిధిలో జేఏసీ బహిరంగ సభ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 6 వరకు సభకు అనుమతి లభించింది.
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. పాదయాత్ర సమయంలో పోలీసులపై అమరావతి రైతులు దాడి చేశారని.. వీడియో ఫుటేజ్ చూపించారు ఏఏజీ. ప్రైవేట్ ప్రదేశంలో సభను నిర్వహించుకోవచ్చు కదా అని ప్రశ్నించింది హైకోర్టు. ఒమిక్రాన్ కేసుల ఉన్నందున సభకు అనుమతించలేదన్న అడిషనల్ ఏజీ. బహిరంగ సభలో ఎలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొంది హైకోర్టు. నిబంధనలకు లోబడి బహిరంగ సభను నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని.. ప్రభుత్వం, అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు పేర్కొంది.
సభ నిర్వహణలో కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని హైకోర్టు ఆదేశించింది. తమ బహిరంగ సభకు కూడా అదే రోజు అనుమతి ఇవ్వాలని కోరింది రాయలసీమ హక్కుల సాధన సమితి. అదే రోజు ఇచ్చేది లేదని, కావాలంటే మరుసటి రోజు సభ నిర్వహించుకోవాలని సూచించింది న్యాయస్థానం.
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గిన భారత్..
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!