గోదావరిపై తెలంగాణ అక్రమంగా 7 ప్రాజెక్టులు నిర్మిస్తోంది : ఏపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర జల్శక్తి శాఖ ఈ రోజు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సీఎస్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. సీడ్ మనీ రూ.200 కోట్లను విడతల వారీగా ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలలకొసారి చెల్లింపులు చేస్తామని ఏపీ ప్రతిపాదించింది. అంతేకాకుండా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ తక్షణమే అమలు చేయాలని కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను పక్కన పెట్టి తెలంగాణ నిర్ణయాలు తీసుకోవడం చట్ట వ్యతిరేకమైన చర్య అంటూ ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ ప్రకారం వివిధ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి మంజూరు చేసినందున కొత్తగా డీపీఆర్ లు అవసరం లేదని ఏపీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గోదావరిపై తెలంగాణ రాష్ట్రం అక్రమంగా 7 ప్రాజెక్టులు నిర్మిస్తోందని కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ఫిర్యాదు చేసింది. వివిధ అంశాల పై రెండు రాష్ట్రాల మధ్య అభ్యంతరాలు ఉన్నందున ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాల్సి ఉందని కేంద్ర జలశక్తి శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాలు అజెండా అంశాలు సిద్ధం చేసిస్తే రెండు రాష్ట్రాల సీఎంలతో కలిపి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించింది.
Also Read
తాజావార్తలు
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
-
India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
-
Ravi Shastri: “చాలా పెద్ద తప్పు చేస్తున్నారు”.. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
-
Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!