మాటల్లేవ్.. ఇక ఉద్యమమే శరణ్యమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికే ఊ అంటున్నాయా? మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటున్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేశాయా? అంటే అవుననే అనిపిస్తోంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ వైఖరి ఉద్యోగ సంఘాలకు మంట పుట్టిస్తోంది. దీంతో తమ డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశాయి ఉద్యోగ సంఘాలు. జనవరి 9 నుంచి ఆందోళన బాట చేపట్టాలని భావిస్తున్నాయి.
పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారాంశాన్ని మాత్రమే ఇచ్చారని, సీఎస్ నివేదిక ప్రకారం అదనంగా జీతాలు రాకపోగా ఉన్న జీతాలకు కోత పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాస రావు. ఇక చర్చలు ముఖ్యమంత్రి తోనే తప్ప అధికారులతో అయ్యే పని కాదని తేలిపోయిందన్నారు. ఈ నెల 9న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాక అదే రోజు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం అన్నారు.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
సంక్రాంతి పండుగ సమయంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టమని చాలా మంది అడుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఆర్ధిక మంత్రి, సీఎస్ మాకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ప్రభుత్వంతో ఘర్షణను మేము కోరుకోవటం లేదు. కానీ ప్రభుత్వమే మా పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సీఎం చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి. మిమ్మల్ని ఆందోళన బాటలో నెట్టేసిన పాపం ప్రభుత్వానిదే అన్నారు.
మావి గొంతెమ్మ కోరికలు కావు.. బొప్పరాజు
తమతో మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించారని, కింద స్థాయి ఉద్యోగులను అవమానించే రీతిలో చర్చలు జరిగాయన్నారు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. మేము దాచుకున్న డబ్బులు 1600 కోట్లు 2వేల కోట్లు అయ్యాయి. ఈ బిల్లులు మార్చి లోగా చెల్లిస్తామనటం ఒక కుట్ర. మా కూలీ డబ్బులనే మేము అడుగుతున్నాం. నాలుగు డీఏలు రావాల్సి ఉందన్నారు బొప్పరాజు. సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి కూడా ఇప్పుడు నోరు విప్పటం లేదు. సీపీఎస్ ఉద్యోగుల వేల కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయో తెలియదు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరటం లేదన్నారు బొప్పరాజు. అధికారులు ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం మాకు ఉంది.
తాజావార్తలు
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!