Gujarat Riots Case: నరోదాగామ్ కేసులో నిందితులందరూ నిర్దోషులే.. అహ్మదాబాద్ కోర్టు సంచలన తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లోని నరోదాగామ్ ఊచకోత కేసులో హ్మదాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో నరోదా గామ్లో 11 మంది చనిపోయారు. ఈ కేసులో గుజరాత్ మంత్రి మాయా కొద్నానీ నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో భజరంగ్ దళ్ నేత బాబు బజరంగీ సహా 86 మంది నిందితులుగా ఉన్నారు.
Also Read:Karnataka Elections: ఈపీఎస్ వర్సెస్ ఓపీఎస్.. పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే
అహ్మదాబాద్లోని నరోదా గామ్లో ఇళ్లకు నిప్పుపెట్టి 11 మంది ముస్లింలు మరణించిన మతపరమైన అల్లర్ల కేసులో అహ్మదాబాద్లోని ప్రత్యేక కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. హత్య జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. విచారణలో 18 మంది చనిపోయారు. మిగిలిన 68 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 13 ఏళ్లలో ఆరుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించారు. 187 మంది సాక్షులను, 57 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించారు. నరోదా గామ్లో మాయా కొద్నానీ నేతృత్వంలోని దుండగులు 11 మందిని ఊచకోత కోశారనేది కేసు. గైనకాలజిస్ట్ మాయా కొద్నానీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో మారణహోమం జరిగింది. ఈ కేసులో కొద్నానీకి అనుకూలంగా కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
Also Read:Hindenburg row: హిండెన్బర్గ్ నివేదికపై వివాదం.. శరద్ పవార్తో గౌతమ్ అదానీ సమావేశం
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
2002లో సబర్మతి కోచ్ దహనం తర్వాత అల్లర్లు చెలరేగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా ఉన్నారు. 2017లో కోద్నానీకి డిఫెన్స్ సాక్షిగా హోంమంత్రి అమిత్ షా కోర్టుకు హాజరయ్యారు. ఫిబ్రవరి 28 ఉదయం శాసనసభలో అల్లర్లు చెలరేగినప్పుడు, ఆపై సివిల్ ఆసుపత్రిలో తాను వారితో ఉన్నానని, అయితే ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్లారో తనకు తెలియదని షా చెప్పారు. నరోదా గామ్కు ఆనుకుని ఉన్న నరోదాపట్యాలో జరిగిన ఊచకోత కేసులో కోర్టు మాయా కొట్నానీకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది, అయితే ఆ తర్వాత నిర్దోషిగా విడుదలైంది. తాజాగా నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేశారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!