Hindenburg row: హిండెన్బర్గ్ నివేదికపై వివాదం.. శరద్ పవార్తో గౌతమ్ అదానీ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి హిండెన్బర్గ్ నివేదికపై వివాదం ఇంకా చల్లారలేదు. ఈ అంశం పార్లమెంట్ సమావేశాలను కుదిపేసింది. హిండెన్బర్గ్ నివేదికపై చర్చించాలంటూ దేశంలోని విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. విపక్ష పార్టీల ఆందోళనకు శదర్ పవార్ కు చెందిన ఎన్సీపీ కూడా మద్దతు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబైలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ను ఆయన ముంబై నివాసంలో ఈరోజు కలిశారు. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు తాను వ్యతిరేకం కాదని, అయితే సుప్రీంకోర్టు కమిటీ మరింత ఉపయోగకరంగా, ప్రభావవంతంగా ఉంటుందని పవార్ ఇటీవల చేసిన ప్రకటన చేశారు. ఈ క్రమంలో తాజాగా గౌతమ్ అదానీ పవార్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబైలోని పవార్ నివాసమైన సిల్వర్ ఓక్లో జరిగిన కీలక సమావేశం దాదాపు రెండు గంటలపాటు కొనసాగింది. ప్రతిపక్షాలు ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ సమావేశం జరగడం గమనార్హం.
Also Read: KA Paul: పవన్ కళ్యాణ్.. రాజీనామా చేసి ఆస్ట్రేలియాకి పో.. లేదా
Also Read
ఈ నెల ప్రారంభంలో శరద్ పవార్ అదానీ గ్రూప్కు తన మద్దతును అందించారు. హిండెన్బర్గ్ నివేదిక చుట్టూ ఉన్న కథనాన్ని విమర్శించారు. పార్లమెంట్లో సంఖ్యా బలం కారణంగా బీజేపీకి జేపీసీ మెజారిటీ ఉంటుందని, అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు కమిటీకి తాను అనుకూలంగా ఉన్నానని చెప్పారు. అటువంటి విచారణ గురించి సందేహాలకు దారి తీస్తుంది. జెపిసి విచారణ కోసం బిజెపి వ్యతిరేక పార్టీల డిమాండ్తో తమ పార్టీ ఏకీభవించనప్పటికీ, ప్రతిపక్ష ఐక్యత కోసం తమ వైఖరికి ఇది విరుద్ధం కాదని ఎన్సిపి చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు.
Also Read: BJP Reacts: గాంధీ కుటుంబంపై చెంపదెబ్బ.. సూరత్ కోర్టు తీర్పుపై బీజేపీ
హిండెన్బర్గ్ ఆరోపణలతో ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలడంతోపాటు స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వివిధ నియంత్రణ అంశాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, బిలియనీర్ అదానీకి చెందిన సంస్థలలో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం జరిగిందని హిండెన్బర్గ్ ఆరోపించింది. దాంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల హిండెన్బర్గ్ ఆరోపణలపై జేపీసీ విచారణకు డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?