Hindenburg row: హిండెన్బర్గ్ నివేదికపై వివాదం.. శరద్ పవార్తో గౌతమ్ అదానీ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి హిండెన్బర్గ్ నివేదికపై వివాదం ఇంకా చల్లారలేదు. ఈ అంశం పార్లమెంట్ సమావేశాలను కుదిపేసింది. హిండెన్బర్గ్ నివేదికపై చర్చించాలంటూ దేశంలోని విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. విపక్ష పార్టీల ఆందోళనకు శదర్ పవార్ కు చెందిన ఎన్సీపీ కూడా మద్దతు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబైలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ను ఆయన ముంబై నివాసంలో ఈరోజు కలిశారు. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు తాను వ్యతిరేకం కాదని, అయితే సుప్రీంకోర్టు కమిటీ మరింత ఉపయోగకరంగా, ప్రభావవంతంగా ఉంటుందని పవార్ ఇటీవల చేసిన ప్రకటన చేశారు. ఈ క్రమంలో తాజాగా గౌతమ్ అదానీ పవార్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబైలోని పవార్ నివాసమైన సిల్వర్ ఓక్లో జరిగిన కీలక సమావేశం దాదాపు రెండు గంటలపాటు కొనసాగింది. ప్రతిపక్షాలు ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ సమావేశం జరగడం గమనార్హం.
Also Read: KA Paul: పవన్ కళ్యాణ్.. రాజీనామా చేసి ఆస్ట్రేలియాకి పో.. లేదా
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
ఈ నెల ప్రారంభంలో శరద్ పవార్ అదానీ గ్రూప్కు తన మద్దతును అందించారు. హిండెన్బర్గ్ నివేదిక చుట్టూ ఉన్న కథనాన్ని విమర్శించారు. పార్లమెంట్లో సంఖ్యా బలం కారణంగా బీజేపీకి జేపీసీ మెజారిటీ ఉంటుందని, అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు కమిటీకి తాను అనుకూలంగా ఉన్నానని చెప్పారు. అటువంటి విచారణ గురించి సందేహాలకు దారి తీస్తుంది. జెపిసి విచారణ కోసం బిజెపి వ్యతిరేక పార్టీల డిమాండ్తో తమ పార్టీ ఏకీభవించనప్పటికీ, ప్రతిపక్ష ఐక్యత కోసం తమ వైఖరికి ఇది విరుద్ధం కాదని ఎన్సిపి చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు.
Also Read: BJP Reacts: గాంధీ కుటుంబంపై చెంపదెబ్బ.. సూరత్ కోర్టు తీర్పుపై బీజేపీ
హిండెన్బర్గ్ ఆరోపణలతో ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలడంతోపాటు స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వివిధ నియంత్రణ అంశాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, బిలియనీర్ అదానీకి చెందిన సంస్థలలో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం జరిగిందని హిండెన్బర్గ్ ఆరోపించింది. దాంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల హిండెన్బర్గ్ ఆరోపణలపై జేపీసీ విచారణకు డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
-
DRAGON : ఎన్టీఆర్ – నీల్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
-
Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..