Hindenburg row: హిండెన్బర్గ్ నివేదికపై వివాదం.. శరద్ పవార్తో గౌతమ్ అదానీ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి హిండెన్బర్గ్ నివేదికపై వివాదం ఇంకా చల్లారలేదు. ఈ అంశం పార్లమెంట్ సమావేశాలను కుదిపేసింది. హిండెన్బర్గ్ నివేదికపై చర్చించాలంటూ దేశంలోని విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. విపక్ష పార్టీల ఆందోళనకు శదర్ పవార్ కు చెందిన ఎన్సీపీ కూడా మద్దతు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబైలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ను ఆయన ముంబై నివాసంలో ఈరోజు కలిశారు. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు తాను వ్యతిరేకం కాదని, అయితే సుప్రీంకోర్టు కమిటీ మరింత ఉపయోగకరంగా, ప్రభావవంతంగా ఉంటుందని పవార్ ఇటీవల చేసిన ప్రకటన చేశారు. ఈ క్రమంలో తాజాగా గౌతమ్ అదానీ పవార్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబైలోని పవార్ నివాసమైన సిల్వర్ ఓక్లో జరిగిన కీలక సమావేశం దాదాపు రెండు గంటలపాటు కొనసాగింది. ప్రతిపక్షాలు ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ సమావేశం జరగడం గమనార్హం.
Also Read: KA Paul: పవన్ కళ్యాణ్.. రాజీనామా చేసి ఆస్ట్రేలియాకి పో.. లేదా
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ఈ నెల ప్రారంభంలో శరద్ పవార్ అదానీ గ్రూప్కు తన మద్దతును అందించారు. హిండెన్బర్గ్ నివేదిక చుట్టూ ఉన్న కథనాన్ని విమర్శించారు. పార్లమెంట్లో సంఖ్యా బలం కారణంగా బీజేపీకి జేపీసీ మెజారిటీ ఉంటుందని, అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు కమిటీకి తాను అనుకూలంగా ఉన్నానని చెప్పారు. అటువంటి విచారణ గురించి సందేహాలకు దారి తీస్తుంది. జెపిసి విచారణ కోసం బిజెపి వ్యతిరేక పార్టీల డిమాండ్తో తమ పార్టీ ఏకీభవించనప్పటికీ, ప్రతిపక్ష ఐక్యత కోసం తమ వైఖరికి ఇది విరుద్ధం కాదని ఎన్సిపి చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు.
Also Read: BJP Reacts: గాంధీ కుటుంబంపై చెంపదెబ్బ.. సూరత్ కోర్టు తీర్పుపై బీజేపీ
హిండెన్బర్గ్ ఆరోపణలతో ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలడంతోపాటు స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వివిధ నియంత్రణ అంశాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, బిలియనీర్ అదానీకి చెందిన సంస్థలలో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం జరిగిందని హిండెన్బర్గ్ ఆరోపించింది. దాంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల హిండెన్బర్గ్ ఆరోపణలపై జేపీసీ విచారణకు డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!