Hindenburg row: హిండెన్బర్గ్ నివేదికపై వివాదం.. శరద్ పవార్తో గౌతమ్ అదానీ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి హిండెన్బర్గ్ నివేదికపై వివాదం ఇంకా చల్లారలేదు. ఈ అంశం పార్లమెంట్ సమావేశాలను కుదిపేసింది. హిండెన్బర్గ్ నివేదికపై చర్చించాలంటూ దేశంలోని విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. విపక్ష పార్టీల ఆందోళనకు శదర్ పవార్ కు చెందిన ఎన్సీపీ కూడా మద్దతు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబైలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ను ఆయన ముంబై నివాసంలో ఈరోజు కలిశారు. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు తాను వ్యతిరేకం కాదని, అయితే సుప్రీంకోర్టు కమిటీ మరింత ఉపయోగకరంగా, ప్రభావవంతంగా ఉంటుందని పవార్ ఇటీవల చేసిన ప్రకటన చేశారు. ఈ క్రమంలో తాజాగా గౌతమ్ అదానీ పవార్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబైలోని పవార్ నివాసమైన సిల్వర్ ఓక్లో జరిగిన కీలక సమావేశం దాదాపు రెండు గంటలపాటు కొనసాగింది. ప్రతిపక్షాలు ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ సమావేశం జరగడం గమనార్హం.
Also Read: KA Paul: పవన్ కళ్యాణ్.. రాజీనామా చేసి ఆస్ట్రేలియాకి పో.. లేదా
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్పోల్కు కీలక అభ్యర్థన
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
ఈ నెల ప్రారంభంలో శరద్ పవార్ అదానీ గ్రూప్కు తన మద్దతును అందించారు. హిండెన్బర్గ్ నివేదిక చుట్టూ ఉన్న కథనాన్ని విమర్శించారు. పార్లమెంట్లో సంఖ్యా బలం కారణంగా బీజేపీకి జేపీసీ మెజారిటీ ఉంటుందని, అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు కమిటీకి తాను అనుకూలంగా ఉన్నానని చెప్పారు. అటువంటి విచారణ గురించి సందేహాలకు దారి తీస్తుంది. జెపిసి విచారణ కోసం బిజెపి వ్యతిరేక పార్టీల డిమాండ్తో తమ పార్టీ ఏకీభవించనప్పటికీ, ప్రతిపక్ష ఐక్యత కోసం తమ వైఖరికి ఇది విరుద్ధం కాదని ఎన్సిపి చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు.
Also Read: BJP Reacts: గాంధీ కుటుంబంపై చెంపదెబ్బ.. సూరత్ కోర్టు తీర్పుపై బీజేపీ
హిండెన్బర్గ్ ఆరోపణలతో ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలడంతోపాటు స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వివిధ నియంత్రణ అంశాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, బిలియనీర్ అదానీకి చెందిన సంస్థలలో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం జరిగిందని హిండెన్బర్గ్ ఆరోపించింది. దాంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల హిండెన్బర్గ్ ఆరోపణలపై జేపీసీ విచారణకు డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!