Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. కర్ణాటకలో మే 10న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి మే 13న ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో రాష్ట్రలోని ప్రధాన పార్టీలు ఇక ప్రచారంతో రంగంలోకి దిగుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా బరిలో దిగుతోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, తమ పార్టీ కర్ణాటకలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
Also Read:India-Russia: భారత్కు మరింతగా రష్యా చమురు.. ఇరు దేశాల మధ్య తాజా ఒప్పందం..
కర్ణాటక ఎన్నికల కోసం ఆప్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, స్థానికులకు ఉద్యోగాల్లో 80 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వంటి 10 హామీలను ఇస్తూ మేనిఫెస్టోను విడుదల చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
Also Read:SriRama Navami: తెలుగురాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కన్నడ ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తామని బెంగళూరులో మీడియా సమావేశంలో పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేస్తూ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఇది కేవలం ఎన్నికల మేనిఫెస్టో మాత్రమే కాదు, ఢిల్లీ, పంజాబ్లలో చేసిన విధంగా మేం నెరవేర్చే 10 హామీల జాబితా అని సింగ్ అన్నారు. ఆప్ అధికారంలోకి వస్తే, ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నిర్ణయించడానికి, నియంత్రించడానికి, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని సింగ్ చెప్పారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచిత సిటీ బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు, వారికి నెలకు రూ. 5,000 స్టైఫండ్తో ఆరు నెలల పాటు ఉపాధి శిక్షణను అందించే కార్యక్రమం రూపొందించబడుతుందని సింగ్ చెప్పారు.
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, వారికి ఉచిత సిటీ బస్సు ప్రయాణాలను కూడా కల్పిస్తుందని సింగ్ చెప్పారు.దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.1,000 “సాధికార భత్యం”గా అందజేస్తామన్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయబడతాయి. స్వామినాథన్ కమిటీ నివేదిక ఆధారంగా ఎంఎస్పి అందించబడుతుంది. వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్ను అందజేస్తామని హామీ ఇచ్చారు అని ఆప్ నాయకుడు చెప్పారు.
Also Read:Pak Twitter Account: పాక్కు షాక్.. భారత్లో అధికారిక ట్విట్టర్ ఖాతా బ్లాక్
వృద్ధాప్య పింఛన్ను నెలకు రూ.400 నుంచి 1,500కు పెంచగా, వితంతు పింఛన్ను 800 నుంచి 2,000లకు పెంచుతామని ఆప్ తమ మేనిఫెస్టో పేర్కొంది. మైనర్ వికలాంగుల పింఛను నెలకు రూ.600 నుంచి రూ.1,500కి పెంచుతామని, వికలాంగుల పెన్షన్ను నెలకు రూ.1,400 నుంచి రూ.2,500కి పెంచుతామని హామీ ఇచ్చింది. ఔషధాల నుండి శస్త్రచికిత్సల వరకు ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు, ప్రతి ప్రాంతంలో, పంచాయతీలో ఢిల్లీ మోడల్ మొహల్లా క్లినిక్ల ఏర్పాటు చేస్తామని పేర్కొంది. రేషన్, ప్రభుత్వ సేవలను ఇంటింటికి పంపిణీ చేయడం వంటివి పార్టీ చేసిన ఇతర వాగ్దానాలను మేనిఫెస్టో పేర్కొంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్న 80 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. మిగిలిన 144 మంది అభ్యర్థులను పార్టీ ఇంకా ఖరారు చేయలేదు. కాగా, ఈ విలేకరుల సమావేశంలో ఆప్ కర్ణాటక రాష్ట్ర కన్వీనర్ పృథ్వీ రెడ్డి, రాష్ట్రానికి చెందిన ఇతర ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.
Also Read:Rakul Preet Singh: ఇప్పటికే అవకాశాలు లేవు.. ఇంకా నువ్వు ఇలా చేస్తే..
తాజావార్తలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..