Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. కర్ణాటకలో మే 10న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి మే 13న ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో రాష్ట్రలోని ప్రధాన పార్టీలు ఇక ప్రచారంతో రంగంలోకి దిగుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా బరిలో దిగుతోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, తమ పార్టీ కర్ణాటకలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
Also Read:India-Russia: భారత్కు మరింతగా రష్యా చమురు.. ఇరు దేశాల మధ్య తాజా ఒప్పందం..
కర్ణాటక ఎన్నికల కోసం ఆప్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, స్థానికులకు ఉద్యోగాల్లో 80 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వంటి 10 హామీలను ఇస్తూ మేనిఫెస్టోను విడుదల చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
Also Read:SriRama Navami: తెలుగురాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కన్నడ ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తామని బెంగళూరులో మీడియా సమావేశంలో పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేస్తూ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఇది కేవలం ఎన్నికల మేనిఫెస్టో మాత్రమే కాదు, ఢిల్లీ, పంజాబ్లలో చేసిన విధంగా మేం నెరవేర్చే 10 హామీల జాబితా అని సింగ్ అన్నారు. ఆప్ అధికారంలోకి వస్తే, ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నిర్ణయించడానికి, నియంత్రించడానికి, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని సింగ్ చెప్పారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచిత సిటీ బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు, వారికి నెలకు రూ. 5,000 స్టైఫండ్తో ఆరు నెలల పాటు ఉపాధి శిక్షణను అందించే కార్యక్రమం రూపొందించబడుతుందని సింగ్ చెప్పారు.
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, వారికి ఉచిత సిటీ బస్సు ప్రయాణాలను కూడా కల్పిస్తుందని సింగ్ చెప్పారు.దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.1,000 “సాధికార భత్యం”గా అందజేస్తామన్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయబడతాయి. స్వామినాథన్ కమిటీ నివేదిక ఆధారంగా ఎంఎస్పి అందించబడుతుంది. వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్ను అందజేస్తామని హామీ ఇచ్చారు అని ఆప్ నాయకుడు చెప్పారు.
Also Read:Pak Twitter Account: పాక్కు షాక్.. భారత్లో అధికారిక ట్విట్టర్ ఖాతా బ్లాక్
వృద్ధాప్య పింఛన్ను నెలకు రూ.400 నుంచి 1,500కు పెంచగా, వితంతు పింఛన్ను 800 నుంచి 2,000లకు పెంచుతామని ఆప్ తమ మేనిఫెస్టో పేర్కొంది. మైనర్ వికలాంగుల పింఛను నెలకు రూ.600 నుంచి రూ.1,500కి పెంచుతామని, వికలాంగుల పెన్షన్ను నెలకు రూ.1,400 నుంచి రూ.2,500కి పెంచుతామని హామీ ఇచ్చింది. ఔషధాల నుండి శస్త్రచికిత్సల వరకు ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు, ప్రతి ప్రాంతంలో, పంచాయతీలో ఢిల్లీ మోడల్ మొహల్లా క్లినిక్ల ఏర్పాటు చేస్తామని పేర్కొంది. రేషన్, ప్రభుత్వ సేవలను ఇంటింటికి పంపిణీ చేయడం వంటివి పార్టీ చేసిన ఇతర వాగ్దానాలను మేనిఫెస్టో పేర్కొంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్న 80 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. మిగిలిన 144 మంది అభ్యర్థులను పార్టీ ఇంకా ఖరారు చేయలేదు. కాగా, ఈ విలేకరుల సమావేశంలో ఆప్ కర్ణాటక రాష్ట్ర కన్వీనర్ పృథ్వీ రెడ్డి, రాష్ట్రానికి చెందిన ఇతర ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.
Also Read:Rakul Preet Singh: ఇప్పటికే అవకాశాలు లేవు.. ఇంకా నువ్వు ఇలా చేస్తే..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!