Maharashtra: మహారాష్ట్రలో మరో సంక్షోభం తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భూకంపం వస్తుందా? అంటే తాజా పరిస్థితిని బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో అధికార కూటమి- ఎన్డీయేలో అనూహ్య మార్పు రావచ్చు. మూలాల ప్రకారం, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవిని సీఎం ఏక్నాథ్ షిండేతో మార్చుకోవచ్చు. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపేందుకు కారణమైన ఏక్నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టారు. గత కొద్ది రోజులుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో నేతలతో టచ్లో ఉన్నారని, ఆయన బీజేపీలో చేరుతారంటూ రాజకీయవర్గాలో తీవ్ర చర్చ సాగింది. అయితే, అజిత్ రాకను ఏక్ నాథ్ షిండే వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో ఠాక్రే వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని షిండే వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Sutra Exhibition: ఏప్రిల్ 27 నుండి 29 వరకు సూత్రా ఎగ్జిబిషన్
పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్లో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో టచ్లో ఉన్నారని మంత్రి ఉదయ్ సమంత్ సంచలన ప్రకటన చేశారు. అలాగే, 20 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు షిండే గ్రూపుతో టచ్లో ఉన్నారని ఉదయ్ సమంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. ఈ విధంగా ఉదయ్ సమంత్ చేసిన ప్రకటన వల్ల కొత్త చర్చలు ఊపందుకున్నాయి. ఓ ఇంటర్యూలో ఠాక్రే వర్గానికి చెందిన మిగిలిన 13 మంది ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండేతో టచ్లో ఉన్నారన్న రహస్యాన్ని ఉదయ్ సమంత్ బయటపెట్టాడు. ఖర్ఘర్ ఘటన తర్వాత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఆ పదవి నుంచి తప్పిస్తారనే చర్చలు జరుగుతున్నాయని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ఉదయ్ సమంత్ కూడా ప్రత్యర్థులను టార్గెట్ చేశాడు.
Also Read
- Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
- Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
ఇదిలా ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆ పదవి నుంచి తప్పిస్తారని, రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి పదవి రాబోతున్నట్లు చెబుతున్నారు. అలాగే ఎన్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత అజిత్ పవార్ పేరు కూడా జోరుగా చర్చనీయాంశమైంది. ‘అజిత్ దాదా కాబోయే ముఖ్యమంత్రి’ అనే కంటెంట్తో కూడిన బ్యానర్లను చాలా మంది NCP కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించారు.
Also Read:Mahesh Babu: సూపర్స్టార్ మహేష్ లాంచ్ చేసిన ‘ప్రేమ విమానం’ టీజర్…
మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. బీజేపీ నాయకత్వం మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర బీజేపీ పిలుపునిస్తుందని ఆపార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే ప్రభుత్వ సవరణలో ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ అంశం ఉత్ప్రేరకంగా ఉంటుందని సమాచారం. అజిత్ పవార్, అతని మద్దతుదారులు బిజెపి ప్రభుత్వంలో చేరవచ్చు. ఇది జరిగితే, రాష్ట్రానికి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండే అవకావం ఉంది. 2024 లోక్సభ ఎన్నికలలో 48 స్థానాలకు గాను కాషాయ పార్టీ 22 నుండి 25 స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని బిజెపి నిర్వహించిన ఒక సర్వేలో అంచనా వేశారు. షిండేని తీసుకోవడం ద్వారా బిజెపికి లాభం చేకూరినట్లు కనిపించడం లేదని ఆపార్టీ భావిస్తోంది. ఎన్డిఎ గూటిలో ముందస్తు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ సీటును కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read:Karnataka polls: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు.. అమిత్ షాపై కేసు నమోదు
షిండే వ్యవహార శైలి వల్ల బీజేపీ మంత్రులు, నాయకుల్లో ఆగ్రహం పెరుగుతోందని, సీఎం పలు ఫైళ్లను క్లియర్ చేయడం లేదని సమాచారం. బిజెపి రాష్ట్ర విభాగం హైకమాండ్కు సమాచారం అందించినప్పటికీ, కర్ణాటక ఎన్నికల వరకు వేచి ఉండాలని రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. మరోవైపు తన చివరి శ్వాస వరకు ఎన్సీపీలోనే ఉంటానని అజిత్ పవార్ మరోసారి పునరుద్ఘాటించారు. కొన్ని రోజుల క్రితం, పవార్ మళ్లీ యూ-టర్న్ తీసుకుంటారని, డజన్ల కొద్దీ ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలో చేరతారని బలమైన ప్రచారం జరిగింది. కానీ, ఏదో విధంగా ఎన్సిపి అధినేత శరద్ పవార్ తన పార్టీని చెక్కుచెదరకుండా ఐక్యంగా ఉంచగలిగారు. ఇకపై మహరాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.
తాజావార్తలు
-
PoKలో PML-N జెండా.. షాబాజ్ షరీఫ్ ఇప్పుడు అన్నను ‘ప్రధాని’ చేస్తాడా?
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
-
Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
-
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!