PoKలో PML-N జెండా.. షాబాజ్ షరీఫ్ ఇప్పుడు అన్నను ‘ప్రధాని’ చేస్తాడా?
- PoK ఎన్నికల్లో దూసుకెళ్తున్న PML-N పార్టీ..
- PoK గెలిచిన తర్వాత షాబాజ్ ఫస్ట్ టార్గెట్ ఇదేనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK Polls: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అసెంబ్లీ ఎన్నికల్లో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొదటి రెండు దశల పోలింగ్లో ఆ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఎన్నికల ప్రచార సమయంలో ముజఫరాబాద్లో జరిగిన సభలో నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. “PML-N విజయం సాధిస్తే తనను PoK ప్రధానమంత్రిగా చేయాలని ప్రధాని షాబాజ్ షరీఫ్ను కోరుతాను” అని ప్రకటించారు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత ఆ వ్యాఖ్యలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జూలై 27న జరిగిన తొలి దశ పోలింగ్లో మీర్పూర్ డివిజన్లోని 13 స్థానాల్లో PML-N తొమ్మిది స్థానాలు గెలుచుకోగా, పీపుల్స్ పార్టీ (PPP) నాలుగు స్థానాలను దక్కించుకుంది. ఆగస్టు 2న జరిగిన రెండో దశలో ముజఫరాబాద్ డివిజన్, శరణార్థుల నియోజకవర్గాల్లో కూడా PML-N ఆధిపత్యం కొనసాగించింది. తొలి రెండు దశల్లో కలిపి సుమారు 23 స్థానాలు గెలుచుకున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ ఆ పార్టీకి లభించినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడో దశ పోలింగ్ ఆగస్టు 10న పూంచ్ డివిజన్లో జరగాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికే PML-N ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి చేరుకుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 53 స్థానాలున్న PoK అసెంబ్లీలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతుండగా, మిగిలిన ఎనిమిది స్థానాలు మహిళలు, టెక్నోక్రాట్లు, మత నాయకుల కోసం రిజర్వ్గా ఉంటాయి. అయితే నవాజ్ షరీఫ్ PoK ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షపై న్యాయపరమైన ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అక్కడి రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి కావాలంటే ఆ ప్రాంతానికి చెందిన ఓటరు, శాసనసభ సభ్యుడు కావాలి. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ పంజాబ్కు చెందిన నాయకుడు. ఆయన PoK అసెంబ్లీకి పోటీ చేయలేదు. దీంతో నేరుగా ఆ పదవిని చేపట్టే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, భారత్ మాత్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్వహిస్తున్న ఎన్నికలను గుర్తించదు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఆ ప్రాంతాలను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుందని భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వస్తోంది.
Also Read
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- France: ఫ్రాన్స్లో కండోమ్ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
- Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
- Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్ల ముప్పు
తాజావార్తలు
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
-
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!