హనుమాన్ మీడియా పతాకంపై గతంలో సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజ్ర్స్, కథ కంచికి మనం ఇంటికి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు విడుదల చేసిన సక్సెస్ఫుల్ నిర్మాత బాలు చరణ్, తాజాగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన గరుడ 2.0 చిత్రాన్ని ఆహా ఓటీటీ లో విడుదల చేశారు. ఈ సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ఆహా ఓటీటీ లో టాప్ 1 గా ట్రెండింగ్ అవుతూ, ఇంకా స్ట్రీమింగ్లో దూసుకెళుతోంది. సినిమా విజయవంతంగా నడుస్తూ నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది.
హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఆమె పెర్ఫార్మెన్స్ సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఇది నిజానికి తమిళంలో బ్లాక్బస్టర్ అయి థియేటర్ లో 50 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఆరత్తు సీనం (Aarathu Sinam) కు తెలుగు డబ్బింగ్ సినిమా. తెలుగు భాషలో గరుడ 2.0 గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అదే స్థాయిలో థ్రిల్ కలిగిస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించిన ఈ సినిమా, కథా నిర్మాణం, టేకింగ్, నేపథ్య సంగీతం అన్ని అంశాలుగూడా ప్రేక్షకులను అటెంచన్ లో ఉంచేలా రూపొందాయి.