Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- నవంబర్ 2026 నెలకు సంబంధించిన..
- రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు..
- నేడు ఉదయం 10 గంటలకు అందుబాటులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 2026 నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) టికెట్లు నేడు (ఆగస్టు 25) న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. శీఘ్ర దర్శనం పొందాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
నవంబర్ నెలకు రూ.300 దర్శనం టికెట్లు:
నవంబర్ 2026లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. ఒక్కో భక్తుడికి టికెట్ ధర రూ.300గా ఉంటుంది. బుకింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. టికెట్లు పరిమితంగా అందుబాటులో ఉండే అవకాశం ఉన్నందున బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికి ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది.
Also Read
- Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు .. రెండో రోజున 70 వేల మందికి పైగా భక్తుల దర్శనం..!
- Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి
- Bhumana Karunakar Reddy: షర్మిల వ్యాఖ్యలు సరికాదు.. భూమన రియాక్షన్
- Chinta Mohan: లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు..
తిరుమల, తిరుపతి రూమ్ బుకింగ్:
నవంబర్ 2026 నెలకు సంబంధించిన తిరుమల, తిరుపతి వసతి గదుల బుకింగ్ కూడా నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. శ్రీవారి దర్శనంతో పాటు వసతి అవసరమైన భక్తులు ఈ సమయానికి టీటీడీ అధికారిక ఆన్లైన్ పోర్టల్లో అందుబాటులో ఉండే రూమ్లను బుక్ చేసుకోవచ్చు.
రూ.300 దర్శనం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?
ముందుగా టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in/ ను సందర్శించాలి. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. అనంతరం ‘Special Entry Darshan’ ఆప్షన్ను ఎంచుకుని నవంబర్ 2026లో మీకు అనుకూలమైన తేదీని ఎంపిక చేసుకోవాలి. తర్వాత భక్తుల వివరాలను సరిగ్గా నమోదు చేసి, అవసరమైన గుర్తింపు వివరాలను అందించాలి. ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్ ప్రక్రియను పూర్తి చేసి టికెట్ను కన్ఫర్మ్ చేసుకోవాలి. బుకింగ్ పూర్తయిన తర్వాత దర్శనం టికెట్ను డౌన్లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
బుకింగ్కు ముందే ఈ జాగ్రత్తలు:
బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికి 10 నుంచి 20 నిమిషాల ముందే అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి సిద్ధంగా ఉండటం మంచిది. భక్తులు తమ చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ గుర్తింపు కార్డును దగ్గరలో ఉంచుకోవాలి. వ్యక్తిగత వివరాలను నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. టీటీడీ సేవలు, దర్శనం, వసతి కోటాలను అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే విడుదల చేస్తుంది. కాబట్టి భక్తులు అనధికారిక వెబ్సైట్లు, ఏజెంట్లను నమ్మకుండా టీటీడీ అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలి. టీటీడీ సంబంధించిన యాప్ లో కూడా ఈ టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చు.
అధికారిక బుకింగ్ వెబ్సైట్: https://ttdevasthanams.ap.gov.in/
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!