Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- నవంబర్ 2026 నెలకు సంబంధించిన..
- రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు..
- నేడు ఉదయం 10 గంటలకు అందుబాటులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 2026 నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) టికెట్లు నేడు (ఆగస్టు 25) న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. శీఘ్ర దర్శనం పొందాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
నవంబర్ నెలకు రూ.300 దర్శనం టికెట్లు:
నవంబర్ 2026లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. ఒక్కో భక్తుడికి టికెట్ ధర రూ.300గా ఉంటుంది. బుకింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. టికెట్లు పరిమితంగా అందుబాటులో ఉండే అవకాశం ఉన్నందున బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికి ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది.
Also Read
- Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు .. రెండో రోజున 70 వేల మందికి పైగా భక్తుల దర్శనం..!
- Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి
- Bhumana Karunakar Reddy: షర్మిల వ్యాఖ్యలు సరికాదు.. భూమన రియాక్షన్
- Chinta Mohan: లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు..
తిరుమల, తిరుపతి రూమ్ బుకింగ్:
నవంబర్ 2026 నెలకు సంబంధించిన తిరుమల, తిరుపతి వసతి గదుల బుకింగ్ కూడా నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. శ్రీవారి దర్శనంతో పాటు వసతి అవసరమైన భక్తులు ఈ సమయానికి టీటీడీ అధికారిక ఆన్లైన్ పోర్టల్లో అందుబాటులో ఉండే రూమ్లను బుక్ చేసుకోవచ్చు.
రూ.300 దర్శనం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?
ముందుగా టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in/ ను సందర్శించాలి. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. అనంతరం ‘Special Entry Darshan’ ఆప్షన్ను ఎంచుకుని నవంబర్ 2026లో మీకు అనుకూలమైన తేదీని ఎంపిక చేసుకోవాలి. తర్వాత భక్తుల వివరాలను సరిగ్గా నమోదు చేసి, అవసరమైన గుర్తింపు వివరాలను అందించాలి. ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్ ప్రక్రియను పూర్తి చేసి టికెట్ను కన్ఫర్మ్ చేసుకోవాలి. బుకింగ్ పూర్తయిన తర్వాత దర్శనం టికెట్ను డౌన్లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
బుకింగ్కు ముందే ఈ జాగ్రత్తలు:
బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికి 10 నుంచి 20 నిమిషాల ముందే అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి సిద్ధంగా ఉండటం మంచిది. భక్తులు తమ చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ గుర్తింపు కార్డును దగ్గరలో ఉంచుకోవాలి. వ్యక్తిగత వివరాలను నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. టీటీడీ సేవలు, దర్శనం, వసతి కోటాలను అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే విడుదల చేస్తుంది. కాబట్టి భక్తులు అనధికారిక వెబ్సైట్లు, ఏజెంట్లను నమ్మకుండా టీటీడీ అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలి. టీటీడీ సంబంధించిన యాప్ లో కూడా ఈ టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చు.
అధికారిక బుకింగ్ వెబ్సైట్: https://ttdevasthanams.ap.gov.in/
తాజావార్తలు
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?