Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి
- సంగారెడ్డిలో ఎన్నికల ప్రచార సభలో డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి
- నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి
- మోడీ హయాంలో అవినీతి లేని పాలన దేశంలో అమలవుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది. కాగా పట్టభద్రుల స్థానం నుంచి బీజేపీ ఎమ్ఎల్సీ అభ్యర్థిగా డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి పోటీచేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. 13 జిల్లాల్లో 271 పట్టణాలు, 499 పోలింగ్ బూత్ లున్నాయని తెలిపారు. ఏ బూత్ కు వెళ్లిన బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుందని అన్నారు.
Also Read:Lalit Modi: వాలంటైన్స్ డే రోజున మరో కొత్త ప్రేయసిని పరిచయం చేసిన లలిత్ మోడీ
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు .. రెండో రోజున 70 వేల మందికి పైగా భక్తుల దర్శనం..!
- Bhumana Karunakar Reddy: షర్మిల వ్యాఖ్యలు సరికాదు.. భూమన రియాక్షన్
- Chinta Mohan: లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు..
ఇటీవల పీఎం మోడీ ఇన్ కమ్ ట్యాక్స్ రిలీఫ్ కలిగించడంతో కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రూ. 12 లక్షల ఆదాయం ఉన్న ఉద్యోగులకు ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కలిపించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్లకు, చిన్న వ్యాపారస్తులకు ప్రయోజనం చేకూరనున్నదని తెలిపారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. అందుకే మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవకుండా కనుమరుగైందని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలిచ్చిందని చెప్పారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసిందని తెలిపాడు. నిరుద్యోగ భృతి రూ. 4 వేలు ఇస్తామని నిరుద్యోగుల ఓట్లు దండుకున్న కాంగ్రెస్ గెలిచిన తర్వాత విస్మరించిందని అన్నారు.
Also Read: GBS Virus In AP: ఏపీలో జీపీఎస్ వైరస్ కేసులు నమోదు.. మంత్రి కీలక సూచనలు
నిరుద్యోగ భృతి చెల్లించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు రూ. 2500 ఇచ్చాకే ఓట్లు అడగాలని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినంకనే కాంగ్రెస్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. మండలిలో ప్రశ్నించే గొంతు కావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. మోడీ హయాంలో అవినీతి లేని పాలన దేశంలో అమలవుతోందని అన్నారు. మేధావులు అంతా ఆలోచించి కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ క్యాండిడేట్ నరేందర్ రెడ్డికి సవాల్ విసిరారు. మీ ప్రభుత్వమే కాబట్టి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు రీలీజ్ చేశాకే ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. మొల్కా కొమురయ్యకు, తనకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి కోరారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..