Bhumana Karunakar Reddy: షర్మిల వ్యాఖ్యలు సరికాదు.. భూమన రియాక్షన్
- షర్మిల వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి రియాక్షన్
- షర్మిల వ్యాఖ్యలు సరికాదు- భూమన కరుణాకర్ రెడ్డి
- జగన్ నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వకారణం- భూమన
- ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించిన ధీశాలి జగన్- భూమన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షర్మిల వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. షర్మిల వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వకారణం.. ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించిన ధీశాలి జగన్ అని పేర్కొన్నారు. తెలంగాణ నా మెట్టునిల్లు అని చెప్పిన షర్మిల.. చివరకు అక్కడ చాప చుట్టి ఏపీకి వచ్చారని ఆరోపించారు. షర్మిల వెనుక ఏ ఒక్క రాజశేఖరరెడ్డి అనుచరులు రాలేదు.. అంతా జగన్ వెనుక నడిచారని భూమన తెలిపారు. చివరకు కాంగ్రెస్లోనూ మీకు మద్దతు లేదని విమర్శించారు. ఇవాళ అన్ని విధాలా షర్మిల ఒంటరి అయ్యారు.. షర్మిల లాంటి చెల్లి జగన్కు ఉండడం చాలా బాధాకరమని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డిని ప్రజల గుండెల నుంచి తుడిచేయాలని భావించే టీడీపీతో షర్మిల కుమ్మక్కు అవడం దారుణమని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
Read Also: Mann Ki Baat – PM Modi: ‘డిజిటల్ అరెస్ట్’లపై మోడీ ఆందోళన.. ప్రజలకు కీలక సూచనలు..
Also Read
- Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు .. రెండో రోజున 70 వేల మందికి పైగా భక్తుల దర్శనం..!
- Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి
- Chinta Mohan: లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు..
- Sexual harassment : జగిత్యాల జానీ రైటర్ సుద్దాలపై లైంగిక వేధింపులు కేసు..
జగన్ను సర్వ నాశనం చేయాలని షర్మిల ఇలా చేస్తున్నారు.. హామీలు అమలు చేయలేక టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని భూమన ఆరోపించారు. నెలకో అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు.. ఈ నెల షర్మిల అంశాన్ని తెచ్చారని అన్నారు. ఇంత జరుగుతుంటే షర్మిలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అక్క, చెల్లి, తమ్ముళ్లకు ఎన్ని ఆస్తులు పంచాడో చంద్రబాబు చెప్పాలని అన్నారు. మరోవైపు.. 164 సీట్లు వచ్చినా కూటమి సంతోషంగా పాలించలేక పోతోందని ఆరోపించారు.
Read Also: Amit Shah: బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్లో శాంతి..
ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న వ్యక్తి జగన్.. జగన్ అంటే వీరికి భయం అని భూమన తెలిపారు. పెళ్ళై ఇన్నేళ్ళ తర్వాత ఆస్తుల పంపకంకు పూర్తి సహకారం అందిస్తున్న వైఎస్ భారతిని అభినందించాలి.. ఓడినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వ్యక్తి జగన్ అని అన్నారు. ఆస్తుల పంపకం కుటుంబ వ్యవహారం.. అయినా చంద్రబాబు రాజకీయ అవసరాలకు షర్మిలను వాడుకుంటున్నారని తెలిపారు. షర్మిల టీడీపీలో చేరుతారో లేక కాంగ్రెస్ నుండే ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతారో తెలియదని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!