Bhumana Karunakar Reddy: షర్మిల వ్యాఖ్యలు సరికాదు.. భూమన రియాక్షన్
- షర్మిల వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి రియాక్షన్
- షర్మిల వ్యాఖ్యలు సరికాదు- భూమన కరుణాకర్ రెడ్డి
- జగన్ నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వకారణం- భూమన
- ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించిన ధీశాలి జగన్- భూమన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షర్మిల వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. షర్మిల వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వకారణం.. ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించిన ధీశాలి జగన్ అని పేర్కొన్నారు. తెలంగాణ నా మెట్టునిల్లు అని చెప్పిన షర్మిల.. చివరకు అక్కడ చాప చుట్టి ఏపీకి వచ్చారని ఆరోపించారు. షర్మిల వెనుక ఏ ఒక్క రాజశేఖరరెడ్డి అనుచరులు రాలేదు.. అంతా జగన్ వెనుక నడిచారని భూమన తెలిపారు. చివరకు కాంగ్రెస్లోనూ మీకు మద్దతు లేదని విమర్శించారు. ఇవాళ అన్ని విధాలా షర్మిల ఒంటరి అయ్యారు.. షర్మిల లాంటి చెల్లి జగన్కు ఉండడం చాలా బాధాకరమని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డిని ప్రజల గుండెల నుంచి తుడిచేయాలని భావించే టీడీపీతో షర్మిల కుమ్మక్కు అవడం దారుణమని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
Read Also: Mann Ki Baat – PM Modi: ‘డిజిటల్ అరెస్ట్’లపై మోడీ ఆందోళన.. ప్రజలకు కీలక సూచనలు..
Also Read
- Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు .. రెండో రోజున 70 వేల మందికి పైగా భక్తుల దర్శనం..!
- Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి
- Chinta Mohan: లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు..
- Sexual harassment : జగిత్యాల జానీ రైటర్ సుద్దాలపై లైంగిక వేధింపులు కేసు..
జగన్ను సర్వ నాశనం చేయాలని షర్మిల ఇలా చేస్తున్నారు.. హామీలు అమలు చేయలేక టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని భూమన ఆరోపించారు. నెలకో అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు.. ఈ నెల షర్మిల అంశాన్ని తెచ్చారని అన్నారు. ఇంత జరుగుతుంటే షర్మిలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అక్క, చెల్లి, తమ్ముళ్లకు ఎన్ని ఆస్తులు పంచాడో చంద్రబాబు చెప్పాలని అన్నారు. మరోవైపు.. 164 సీట్లు వచ్చినా కూటమి సంతోషంగా పాలించలేక పోతోందని ఆరోపించారు.
Read Also: Amit Shah: బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్లో శాంతి..
ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న వ్యక్తి జగన్.. జగన్ అంటే వీరికి భయం అని భూమన తెలిపారు. పెళ్ళై ఇన్నేళ్ళ తర్వాత ఆస్తుల పంపకంకు పూర్తి సహకారం అందిస్తున్న వైఎస్ భారతిని అభినందించాలి.. ఓడినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వ్యక్తి జగన్ అని అన్నారు. ఆస్తుల పంపకం కుటుంబ వ్యవహారం.. అయినా చంద్రబాబు రాజకీయ అవసరాలకు షర్మిలను వాడుకుంటున్నారని తెలిపారు. షర్మిల టీడీపీలో చేరుతారో లేక కాంగ్రెస్ నుండే ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతారో తెలియదని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!