Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు .. రెండో రోజున 70 వేల మందికి పైగా భక్తుల దర్శనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. రెండో రోజు వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మొత్తం 70,256 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని పరవశించారు. దర్శనంతో పాటు తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. రెండో రోజున 25,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అదే విధంగా భక్తుల విరాళాలతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.79 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు.
New Year Celebrations: జోరుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
Also Read
- Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి
- Bhumana Karunakar Reddy: షర్మిల వ్యాఖ్యలు సరికాదు.. భూమన రియాక్షన్
- Chinta Mohan: లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు..
- Sexual harassment : జగిత్యాల జానీ రైటర్ సుద్దాలపై లైంగిక వేధింపులు కేసు..
వైకుంఠ ద్వార దర్శనాల నిర్వహణపై టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాళ కూడా టోకెన్ కలిగిన భక్తులకే దర్శనానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు దర్శనం సజావుగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రేపటి నుంచి టోకెన్ లేకుండా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే ఆన్లైన్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు, శ్రీవాణి దర్శన టిక్కెట్లు పొందిన భక్తులకూ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
Swarna Ward: ఏపీలో కీలక నిర్ణయం.. ఇకపై ‘వార్డు సచివాలయం’ కాదు ‘స్వర్ణ వార్డు’
ఇదిలా ఉండగా.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
-
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!