Governor Tamilisai: యాదాద్రి నరసింహ స్వామి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Tamilisai: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు నాలుగో రోజు ఉదయం వత్రశాయి అలంకరణ సేవ అత్యంత వైభవంగా కొనసాగుతుంది. పశ్చిమ రాజగోపురం గుండా సేవను తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం వేంచేపు మండపం పై ఆస్థానం చేసి, వేదమంత్రాలు, దివ్యప్రబంధ పశురాలను పఠించారు. సాయంత్రం హంస వాహన అలంకరణ సేవ నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఈనేపథ్యంలో.. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు గవర్నర్ తమిళసై చేరుకున్నారు. గవర్నర్ ను గార్డ్ ఆఫ్ హానర్ తో జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నాలుగో రోజు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం జరిగే హోమం, వటపత్ర శాయి అలంకార సేవలో గవర్నర్ తమిళసై పాల్గొన్నారు.
Read also: Raja Singh: నన్ను చంపుతామని బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయి..
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
మాడవీధుల్లో ఊరేగిన శ్రీస్వామి వారి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఉదయం 9.05 గంటలకు యాదగిరి గుట్టకు చేరిన గవర్నర్ మొదటగా స్వయంభూ నరసింహుడి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ మాట్లాడుతూ.. కరోనా విలయం, ఆలయ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఇవి అని కొనియాడారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈసారి చాలా ప్రత్యేకమైనవని, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని గవర్నర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, సుఖవంతంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. ప్రజలందరూ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించాలని కోరారు. నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ప్రజలు పాల్గొని, స్వామివారిని దర్శించుకోని, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Cyber Thieves: టెలిగ్రామ్ యాప్, డేటాఫ్ బర్త్ పేరిట మోసం.. కోట్లు కొట్టేస్తున్న సైబర్ కేటుగాళ్లు
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!