Cyber Thieves: టెలిగ్రామ్ యాప్, డేటాఫ్ బర్త్ పేరిట మోసం.. కోట్లు కొట్టేస్తున్న సైబర్ కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Thieves: రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఒక దానిపై ప్రజలు తెలుసుకునే లోపే మరొక సైబర్ నేరానికి తెర లేపుతున్నారు. ఈకాలంలో ఆన్లైన్ పేమెంట్లు, షాపింగ్ పెరిగుతుండటంతో.. మోసాలు కూడా అదే రేంజ్లో పెరుగుతున్నాయి. దీంతో..ఇక సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ఎక్కడా లేని విధంగా.. ఎవరూ ఊహించని రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక జనాలను మోసం చేయడానికి సైబర్ మోసగాళ్లు ఎలాంటి మార్గం వదలిపెట్టడం లేదు. అయితే దీనిపై పోలీసులు సైబర్ నేరాల గురించి ఎంత అవగాహన కల్పించినా సరే.. ఏదో రకమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఒకరకమైన నేరాల గురించి అవగాహన కల్పించేలోపే మరో రకమైన మోసాలకు వెలుగులోకి వస్తున్నారు.
Read also: Medico Preethi: ప్రీతి ఫోన్ చాటింగ్ తో పాటు కొన్ని కీలక ఆధారాలు.. కస్టడిలో సైఫ్
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ప్రజలను మోసం చేసేందుకు సైబర్ కేటుగాళ్ల టెలిగ్రామ్ యాప్ అడ్డాగా ఎంచుకున్నారు. నాలుగురోజుల్లో హైదరాబాద్ .. నగరానికి చెందిన ముగ్గురిని ట్రాప్ చేసి కోటిన్నరదాకా కాజేశారు. యూట్యూబ్ వీడియోస్ యాడ్స్ క్లిక్ చేస్తే లక్షల్లో కమీషన్ అంటూ ఎరవేస్తూ లక్షలు కాజేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇద్దరి నుండి కోటికి పైగా సైబర్ ఫ్రాడ్ చేశారు. ఇక తాజాగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ట్రాప్ చేసి ఇరవై లక్షలకు పైగా కొట్టేయడం సంచలనంగా మారింది. అందమైన యువతుల డీపీలు పెట్టి యూజర్స్ ను చీటీర్స్ ట్రాప్ చేస్తున్నారు. టెలిగ్రామ్ లో ఫోన్ నెంబర్ హైడ్ ఆప్షన్ ను అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందిన కాడికి కాజేసి తర్వాత టెలిగ్రామ్ లో అకౌంట్ డిలీట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రంగంలోకి దిగిన పోలీసులు సబైర్ నేరస్తులను పట్టుకునే పనిలో పడ్డారు. సైబర్ నేరస్తుల చేతిలో డబ్బులను పోగొట్టుకుని లబోదిబో మంటున్నారు. న్యాయం చేయండి అంటూ పోలీస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.
Read also: Ram Gopal Varma: కేటీఆర్ సార్.. మేయర్ ఇంట్లోకి వీధికుక్కలను వదలండి.. ఆర్జీవీ వీడియో వైరల్..
ఇక ఇలాంటి తరహాలోనే మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా డేటాఫ్ బర్త్ పేరిట సైబర్ మోసానికి పాల్పడుతూ అమాయక జనాన్ని ఆడేపుకుంటున్నారు. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుభాష్ రావు కు చెందిన క్రెడిట్ కార్డులో డేటాఫ్ బర్త్ తప్పుగా ఉందని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. డేటాఫ్ బర్త్ సరిచేయాలని నమ్మ బలికాలు. దీంతో సుభాష్ రావు మొబైల్ లో ఓయాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించిన సైబర్ నేరగాళ్లు. అయితే.. నిజమని నమ్మిన సుభాష్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నాడు. అంతే ఒక్కనిమిషంలోనే అతని ఖాతాలో వున్న 1,06,910 లక్ష రూపాయలు అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లుగా మొబైల్ కు మెసేజ్ రావడంతో సుభాష్ కు మైండ్ బ్లాంక్ అయ్యింది. తిరిగి ఫోన్ నెంబర్ కాల్ చేయడంతో స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళనకు గురైన సుభాష్ రావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. స్థానిక సదాశివనగర్ పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సదాశివనగర్ పోలీసులు.
AAP: ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీ గూటికి ఢిల్లీ కౌన్సిలర్..
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!