Raja Singh: నన్ను చంపుతామని బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh: తనకు బెదిరింపు కాల్స, మెసేజ్ లు వస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయకపోవడం విడ్డూరంగా వుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమాండ్ కంట్రోల్ రూం ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ , కాంగ్రెస్ నేతల పోన్ లు టాపింగ్ చేయడానికి, బీజేపీ తో బీఆర్ఎస్ నేతలు ఎవరు టచ్ లో ఉన్నారు అని తెలుసుకోవడానికి ఉందా? అంటూ వ్యంగాస్త్రం వేశారు రాజాసింగ్. బెదిరిస్తున్నారని కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయని చెప్పిన ఇప్పటి వరకు ఆక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు. నన్ను చంపుతామని, స్లిపర్ సెల్స్ మీ చుట్టే ఉన్నారని బెదిరిస్తున్నారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. టెర్రరిస్ట్ లకు ఎంఐఎం ఆశీర్వాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని అరెస్ట్ చేస్తే ఉద్యోగాలు పోతాయని పోలీసులు భయపడుతున్నారా? అంటూ ప్రశ్నించారు రాజాసింగ్.
Read also: Kondagattu Temple: కొండగట్టు ఆలయంలో చోరీ.. బంగారు నగలతో పాటు విగ్రహాలు మాయం
Also Read
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
రాజా సింగ్ పై దేశాన్ని ధర్మాన్ని టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో మెసేజ్ లు రావడం సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా విదేశాల నుండి మెసేజ్ లు, పాకిస్తాన్ నుండి పోన్ కాల్ రావడంతో.. తనకు వస్తున్న మెసేజ్ లపై రాజా సింగ్ డీజీపీ పిర్యాదు చేసారు. గతంలో హరేన్ పాండ్య హత్య కేసులో టెర్రరిస్టులను అరెస్ట్ చేయడానికి వస్తే ఎంఐఎం కమిషనర్ కార్యాలయం ముందు ప్రొటెస్ట్ చేశారని ఆరోపించారు. టెర్రరిస్టులకు ఆర్థికంగా, ఫిజికల్ ఎంఐఎం సహకరిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. నేను దేనికి భయపడనని, నాకు జైలు ఫార్మ్ హౌస్ వంటిదని, దేశం కోసం దేనికైనా సిద్ధమన్నారు రాజాసింగ్. ధర్మం కోసం చావాలి..దేశ ద్రోహులను చంపాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాని తెలిపారు. మళ్ళీ జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని, రెండు సార్లు ఎమ్మెల్యే అయిన చాలని రాజాసింగ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Cyber Thieves: టెలిగ్రామ్ యాప్, డేటాఫ్ బర్త్ పేరిట మోసం.. కోట్లు కొట్టేస్తున్న సైబర్ కేటుగాళ్లు
తాజావార్తలు
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..