Wife Killed Husband: ఫోన్ లో మాట్లాడుతుందని మందలించిన భర్త.. గొంతు నులిమి హత్య చేసిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Killed Husband: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ మతాలు వేరైనా, పెద్దల అంగీకారంతో.. పెళ్లి కూడా చేసుకున్నారు. వీల్ల జీవితం ఏడేళ్లపాటు సాఫీగా ఏచీకూచింతా లేకుండా అన్యోన్యంగా మెలిగారు. వీరిద్దరికి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త అనుమానించడం మొదలు పెట్టాడు. భార్యను తన ప్రవర్తన మార్చుకోవాలని పదే పదే చెబుతుండటంతో.. గొంతు నులిమి చంపేసింది.. ఈదారుణమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెద్దపల్లి ఎన్టీపీసీ ఆటోనగర్కు చెందిన అజీంఖాన్ అదే కాలనీకి చెందిన శ్రావణి ఏడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేరైనా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడంతో వీరి పెళ్లి సులువైంది. అయితే.. పెళ్లయిన తర్వాత భార్యభర్తలు ఇద్దరూ శ్రావణి తల్లి నర్మదా ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. కానీ, వీరికి ఇద్దరు కుమారులు హమాన్, హర్మాన్. శ్రావణి కృష్ణానగర్లోని ఒక కార్పొరేట్ వ్యాపార సంస్థలో పనికి వెళ్తుంది. ఈనేపథ్యంలో.. శ్రావణి రోజూ ఫోన్లో మాట్లాడుతూ పనికి వెళ్తుండటంతో అజీంఖాన్ చూశాడు. ఫోన్లో అలా గంటలు గంటలు మాట్లాడటం ఏంటి.. ప్రవర్తన మార్చుకోవాలని పదేపదే చెప్పాడు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
అయినా.. ఇదే విషయమై భార్య శ్రావణి, అత్త నర్మదాతో అజీంఖాన్ గొడవకు దిగాడు.. కాలనీ మధ్యలోకి వచ్చి గొడ్డలితో నరికేస్తానంటూ బెదిరించడంతో, శ్రావణి, నర్మదా ఇద్దరూ అతన్ని ఇంట్లోకి లాక్కెళ్లారు. దీంతో.. ఇంట్లోకి వెళ్లిన తర్వాత శ్రావణి భర్త గొంతును గట్టిగా నులిమేయడంతో ఊపిరి ఆడక అతను కింద పడిపోయాడు. దీంతో.. అజీంఖాన్ స్పృహ లేకుండా ఉండటాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. అక్కడకు హుటాహుటిన చేరుకున్న సిబ్బంది, అంజీంఖాన్ను పరిశీలించి మృతిచెందినట్లు నిర్థారించారు. ఈ.. సంఘటనా స్థలానికి చేరుకున్న గోదావరిఖని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Teacher Punish is a Student: హోంవర్క్ చేయలేదని కొట్టిన టీచర్.. బాలిక మృతి
- Tags
- autonaga
- husband
- Peddapalli
- wife
తాజావార్తలు
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!