Kanuma Festival Travel: కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయొద్దా?.. చేస్తే ఏమవుతుందో తెలుసా..!
- తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ..
- కనుమను పశువుల పండుగగా భావించేవారు ప్రజలు..
- ఈ రోజున ఎద్దులు, ఆవులు, గేదెలను అలంకరించి ఊరేగింపులు, పందెం పోటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanuma Festival Travel: తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ మరుసటి రోజున కనుమ (Kanuma Festival)ను జరుపుకుంటారు. ఏటా 12 సంక్రాంతులు మాదిరిగానే కనుమలూ వస్తుంటాయి. అయితే, మకర సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమకు ప్రత్యేకంగా వేడుకలు చేసుకుంటారు. ఇది పాడి పశువుల ఫెస్టివల్.. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సాహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత చెప్పుకుంటారు. పండించిన పంటను పశుపక్ష్యాదులతో పంచుకోవాలని ఉద్ధేశ్యంతో పిట్టల కోసం ఇంటి గుమ్మాలకు ధాన్యపు కంకులను అన్నదాతలు కడతారు. ఇక, కనుమ రోజు కాకులు అయినా కదలదనే సామెతను గుర్తు చేస్తూ.. ఈ రోజు ప్రయాణాలు చేయొద్దని పూర్వీకులు చెబుతుంటారు.
Read Also: US-Iran: వెనక్కి తగ్గిన అమెరికా.. తెరుచుకున్న ఇరాన్ గగనతలం
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
అయితే, పల్లెల్లో పశువులే గొప్ప సంపదగా భావిస్తారు.. అవి ఆనందంగా ఉంటేనే కదా రైతుకు ఆనందం. కాగా, కనుమ పండుగను పల్లెల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏడాది మొత్తం రైతుతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజున ఎలాంటి పనులూ చేయించకుండా పూర్తిగా విశ్రాంతిని కల్పిస్తారు. రకరకాల పోటీలు నిర్వహించి ఆనందిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదనే ఆచారం వెనుక ఓ గొప్ప విషయం ఇమిడి ఉంది. వాస్తవానికి పూర్వకాలంలో ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజించడంతో ఆ ఒక్క రోజైనా వాటికి రెస్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు ప్రయాణాన్ని వాయిదా వేసుకునేవారు. దీంతో కనుమ రోజున కాకి అయినా కదలదు అనే సామేత వచ్చింది.
Read Also: Prabhala Theertham: నేడు జగ్గన్నతోటలో ప్రభల తీర్థం.. భారీగా వెళ్తున్న జనం..
కాగా, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పండుగ సమయంలో వచ్చిన బంధుమిత్రులు వెంటనే వెళ్లిపోకుండా అందరితో ఆనందంగా గడిపేందుకు.. కలిసి భోజనం చేస్తూ కష్టసుఖాలను పంచుకొవడానికి వీలుగా కూడా ఈ నియమం పెట్టారని కూడా చెప్పొచ్చు. అయితే, తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల గురుగుల నోమును ఆచరించే సంప్రదాయం ఉంది. కొత్తగా పెళ్లైన వారు.. ఈ పండగ సమయంలో మట్టితో చిన్న పాత్రల్ని తయారు చేసుకుని అందులో బెల్లం-నువ్వుల ఉండలు, చెరకు ముక్కలు, చిల్లర, రేగుపళ్లు, జీడిపళ్లు లాంటివి పెట్టి తాంబూలంగా ఇవ్వడం అక్కడి సంప్రదాయంగా వస్తుంది.
తాజావార్తలు
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!