Kanuma Festival Travel: కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయొద్దా?.. చేస్తే ఏమవుతుందో తెలుసా..!
- తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ..
- కనుమను పశువుల పండుగగా భావించేవారు ప్రజలు..
- ఈ రోజున ఎద్దులు, ఆవులు, గేదెలను అలంకరించి ఊరేగింపులు, పందెం పోటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanuma Festival Travel: తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ మరుసటి రోజున కనుమ (Kanuma Festival)ను జరుపుకుంటారు. ఏటా 12 సంక్రాంతులు మాదిరిగానే కనుమలూ వస్తుంటాయి. అయితే, మకర సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమకు ప్రత్యేకంగా వేడుకలు చేసుకుంటారు. ఇది పాడి పశువుల ఫెస్టివల్.. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సాహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత చెప్పుకుంటారు. పండించిన పంటను పశుపక్ష్యాదులతో పంచుకోవాలని ఉద్ధేశ్యంతో పిట్టల కోసం ఇంటి గుమ్మాలకు ధాన్యపు కంకులను అన్నదాతలు కడతారు. ఇక, కనుమ రోజు కాకులు అయినా కదలదనే సామెతను గుర్తు చేస్తూ.. ఈ రోజు ప్రయాణాలు చేయొద్దని పూర్వీకులు చెబుతుంటారు.
Read Also: US-Iran: వెనక్కి తగ్గిన అమెరికా.. తెరుచుకున్న ఇరాన్ గగనతలం
Also Read
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
- CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
- Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
అయితే, పల్లెల్లో పశువులే గొప్ప సంపదగా భావిస్తారు.. అవి ఆనందంగా ఉంటేనే కదా రైతుకు ఆనందం. కాగా, కనుమ పండుగను పల్లెల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏడాది మొత్తం రైతుతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజున ఎలాంటి పనులూ చేయించకుండా పూర్తిగా విశ్రాంతిని కల్పిస్తారు. రకరకాల పోటీలు నిర్వహించి ఆనందిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదనే ఆచారం వెనుక ఓ గొప్ప విషయం ఇమిడి ఉంది. వాస్తవానికి పూర్వకాలంలో ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజించడంతో ఆ ఒక్క రోజైనా వాటికి రెస్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు ప్రయాణాన్ని వాయిదా వేసుకునేవారు. దీంతో కనుమ రోజున కాకి అయినా కదలదు అనే సామేత వచ్చింది.
Read Also: Prabhala Theertham: నేడు జగ్గన్నతోటలో ప్రభల తీర్థం.. భారీగా వెళ్తున్న జనం..
కాగా, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పండుగ సమయంలో వచ్చిన బంధుమిత్రులు వెంటనే వెళ్లిపోకుండా అందరితో ఆనందంగా గడిపేందుకు.. కలిసి భోజనం చేస్తూ కష్టసుఖాలను పంచుకొవడానికి వీలుగా కూడా ఈ నియమం పెట్టారని కూడా చెప్పొచ్చు. అయితే, తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల గురుగుల నోమును ఆచరించే సంప్రదాయం ఉంది. కొత్తగా పెళ్లైన వారు.. ఈ పండగ సమయంలో మట్టితో చిన్న పాత్రల్ని తయారు చేసుకుని అందులో బెల్లం-నువ్వుల ఉండలు, చెరకు ముక్కలు, చిల్లర, రేగుపళ్లు, జీడిపళ్లు లాంటివి పెట్టి తాంబూలంగా ఇవ్వడం అక్కడి సంప్రదాయంగా వస్తుంది.
తాజావార్తలు
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!