Weather Update: తెలంగాణలో పెరిగిన చలి.. ఈ ఏరియాల్లో మరింత గజగజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Update: ఉత్తర భారత దేశాన్ని గత వారంపాటు గజగజ వణికించిన చలి ఇప్పుడు దక్షిణ భారత దేశం వైపు వణికించేందుకు వచ్చేస్తోంది. దీని వల్ల తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. అలాగే మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువ కానుంది. జనవరి 12 వరకు చలి తీవ్రత మరింత ఎక్కువకానుంది. ఇక సాయంకాలం 4 గంటల నుంచి చలి ప్రారంభించి తెల్లవారుజాము వరకు కొనసాగనుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో శీతల గాలుల కారణంగా విపరీతంగా చలి పెరిగింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి చాలా జిల్లాల్లో చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
చలి పంజా..
ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడి పోయాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 7.8 , నల్లవల్లిలో 8.2, న్యాల్కల్ లో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. సిద్దిపేట జిల్లా నంగనూర్ లో 9.1, అంగడి కిష్టపూర్ లో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా శివ్వంపేట లో 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడి పోయాయి. చాలా చోట్ల సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొమురం భీం జిల్లా లో 4.7గా నమోదు కాగా.. మంచిర్యాల జిల్లా లో 7.4 నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 7.6 కాగా.. నిర్మల్ జిల్లా 8.9 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదైంది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు కొమురం భీం జిల్లాలో నమోదైంది.
రేపు (సోమవారం) ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేవలం దక్షిణ తెలంగాణలో 6 లేదా 7 జిల్లాలకు మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. ఇక.. నగరంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. కాగా.. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న (శనివారం) 26.2 డిగ్రీలు, 18.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Air India Urinating Case: ఫోన్ స్విచ్చాఫ్.. నిందితుడు మిశ్రా ఎలా చిక్కాడంటే?
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!