Air India Urinating Case: ఫోన్ స్విచ్చాఫ్.. నిందితుడు మిశ్రా ఎలా చిక్కాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How Delhi Police Arrested Air India Unirating Case Accused Shankar Mishra: ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రాను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరులో శుక్రవారం అర్ధరాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అప్పటికే పరారీలో ఉన్న మిశ్రా, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. తన లొకేషన్ తెలియకుండా ఉండేందుకు ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఎవరితోనైనా సంభాషించాలన్నా.. సామాజిక మాధ్యమాల ద్వారానే చేసేవాడు. కానీ ఏం లాభం.. అతని పప్పులు ఎక్కువసేపు ఉడకలేదు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, తమదైన శైలిలో గాలింపు చర్యలు చేపట్టి, అతడ్ని అరెస్ట్ చేయడం జరిగింది.
Urfi Javed: నాకు బట్టలంటే ఎలర్జీ.. అందుకే వేసుకోకుండా తిరుగుతాను
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
తొలుత.. పోలీసులు మిశ్రాపై జనవరి 4వ తేదీన కేసు నమోదు చేయడానికి ఒకరోజు ముందే, అతడు తన మొబైల్ ఫోన్ని స్విచ్చాఫ్ చేశాడు. కేసు నమోదు చేశాక ఫోన్ స్విచ్చాఫ్ అయిన సంగతి తెలుసుకున్న పోలీసులు.. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్రేసింగ్, బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించారు. ముంబయి, బెంగళూరులోని తన కంపెనీ కార్యాలయాల మధ్య మిశ్రా గతంలో తరచూ ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడు బెంగళూరులో ఉన్నట్టు తేలింది. దీంతో.. ఢిల్లీ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించింది. బెంగళూరులోని తన ఆఫీస్కి మిశ్రా వెళ్లాడని తెలుసుకున్న పోలీసులు.. అక్కడ విచారించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే ట్రావెల్ హిస్టరీని ట్రాక్ చేశారు. శుక్రవారం రాత్రి మైసూరులో అతని ఆచూకీ లభ్యమవ్వడంతో.. అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే అతడు మైసూరు వీడాడు.
Serial Killer: హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్.. వృద్ధ మహిళలే లక్ష్యం, ఇప్పటివరకు 3 హత్యలు
మైసూర్ నుంచి ఏ ట్యాక్సీలో వెళ్లాడన్న సమాచారాన్ని సేకరించిన పోలీసులు.. ఎట్టకేలకు ట్యాక్సీ డ్రైవర్ వివరాలు తెలుసుకున్నారు. అతని నుంచి కీలక ఆధారాలు లభించాయి. ఫైనల్గా.. బెంగళూరులో మిశ్రా లొకేషన్ అభ్యమవ్వడంతో, పోలీసుల బృందం వెంటనే రంగంలోకి దిగింది. స్థానిక పోలీసులు సహకారంతో మిశ్రాను అదుపులోకి తీసుకుంది. శనివారం రాత్రి అతడ్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచగా.. అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపించింది. మరోవైపు.. ఘటనా సమయంలో ఉన్న విమాన పైలట్, క్యాబిన్ సిబ్బందిపై ఎయిర్ ఇండియా ఇప్పటికే వేటు వేసింది.
Broke Bottle Head : ‘సల్మాన్ ఖాన్ నా తలపై బాటిల్ పగులగొట్టాడు’.. ప్రియురాలు సోమి అలీ
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!