Crime News: బంగారం కోసం వృద్ధురాలి హత్య.. ఇంట్లోనే ఉన్న బావిలో పడేసిన నిందితులు
- బంగారం కోసం వృద్ధురాలి హత్య
- వికారాబాద్ జిల్లా కోట్ మర్పల్లి గ్రామంలో ఘటన
- అదే గ్రామానికి చెందిన కొందరు దుండగులు హత్య
- వృద్ధురాలిని చంపి ఇంట్లోనే ఉన్న బావిలో పడేసిన దుండగులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బు, బంగారం కోసం దుండగులు ఎంతటి దానికైనా తెగిస్తున్నారు. వృద్ధులు, పెద్దలు, చిన్న పిల్లలు అని తేడా లేకుండా చంపేస్తున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా.. బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Read Also: Mahua Maji: కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. జేఎంఎం ఎంపీకి తీవ్రగాయాలు
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం కోట్ మర్పల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ వృద్ధురాలిని అదే గ్రామానికి చెందిన కొందరు దుండగులు హత మార్చారు. అర్ధరాత్రి సమయంలో వినోద అనే వృద్ధురాలిని చంపేసి.. ఆమె ఇంట్లోనే ఉన్న బావిలో పడేశారు. అదే గ్రామానికి చెందిన రాజు, నర్సింలు, షఫీయుద్దీన్ ఈ ముగ్గురు కలిసి అర్ధరాత్రి ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న బంగారం.. 21,000 నగదు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వృద్ధురాలు నిద్రలో నుంచి లేచి ఆ ముగ్గురిని చూసి అరిచింది. తాము చోరీ చేసిన విషయాలు బయటకు చెప్తుందని భావించి ముగ్గురు కలిసి వృద్ధురాలిని చంపేసి ఇంట్లోనే ఉన్న బావిలో గుర్తు పట్టకుండా పడేశారు. అంతేకాకుండా.. వారి ఆనవాళ్లు తెలియకూడదని ఇంట్లో ఉన్న బీరువాను తగలబెట్టేశారు.
Read Also: Ravi Teja : మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న సీక్వెల్
అదే గ్రామానికి చెందిన స్థానికులు.. ఈ ముగ్గురు వినోద ఇంటి చుట్టూ అర్ధరాత్రి తిరగడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. పోలీసులు చాలా చకచక్యంగా ముగ్గురును అరెస్ట్ చేసి విచారించగా వృద్ధురాలి వినోదను తామే డబ్బు, బంగారం కోసం హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. మృతురాలి కుమార్తె విమలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి వద్ద నుంచి పోలీసులు బంగారం లాకెట్, రూ.21,000 స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!